కడపలో కాదు ఒడిషాలో స్టీల్ ప్లాంట్..!

ఆంధ్రకు స్టీల్ ప్లాంట్ తీసుకు రావడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. పోస్కో వస్తోందని… రావాలని ఆయన కోరుకుంటున్నారు. చర్చలకు రావాలని.. కృష్ణపట్నంలోనే కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామనిలేఖ రాశారు. కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని విభజన చట్టంలో ఉన్నప్పటికీ.. కేంద్రం పెద్దగా పట్టించుకోలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ పెట్టాలని డిసైడ్ చేసి.. జగన్మోహన్ రెడ్డి.. శంకుస్థాపన కూడా చేారు. అయితే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కానీ.. ఉక్కు మంత్రి మాత్రం.. తన రాష్ట్రానికి మాత్రం.. రూ. యాభై వేల కోట్లతో ప్రైవేటు పరిశ్రమను తరలించుకుపోయారు. ప్రపంచ ఉక్కు దిగ్గజం… ఆర్సెలార్ మిట్టర్..ఇండియాలో ఓ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనుకున్నారు.

ఆ ప్లాంట్ కోసం.. ఉక్కు మంత్రి తన పలుకుబడి అంతా ఉపయోగించుకుని ఒడిషాకు తరలించుకుపోయారు. ఏపీలో ఉన్న స్టీల్ ప్లాంట్‌ను మాత్రం ప్రైవేటీకరణ చేయడానికి శరవేగంగా అడుగులు వేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుడా ఉండటానికి క్యాప్టివ్ మైన్స్ ఉంటే చాలని.. లాభాల్లోకి వస్తుందని.. బిజినెస్ ఎక్స్‌పర్ట్స్ చెబుతూనే ఉన్నారు. అయినప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం కలగడం లేదు. పోస్కోకు క్యాప్టివ్ మైన్స్ ఉన్నాయని…. సాకులు చెబుతున్నారు. ఇప్పుడు ఆర్సెలార్ మిట్టర్ ఒడిషాలో ప్లాంట్ పెట్టడానికి క్యాప్టిన్ మైన్స్‌ను కూడా కేటాయించాల్సి ఉంది. రూ. యాభై వేల కోట్ల పెట్టుబడి అంటే.. చిన్న విషయం కాదు. విశాఖ స్టీల్ ప్లాంట్ డిమాండ్ మొత్తం… ఆ ప్లాంట్‌కు తరలిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని ఉండదు.

ఓ రకంగా.. ఆ ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభిస్తే..ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభ మసకబారడం ఖాయమని అంటున్నారు. ఆ ప్లాంట్ తో విశాఖ పోటీ పడాలంటే.. క్యాప్టివ్ మైన్స్‌ను కేటాయించాల్సి ఉంటుంది. సీఎం జగన్.. ప్రత్యేకంగా చొరవ తీసుకుని విభజన హామీ ప్రకారం.. పెట్టాల్సిన స్టీల్ ప్లాంట్‌ను ఏపీకి తీసుకు వస్తే.. పారిశ్రామికీకరణలోగొప్ప విజయం సాధించినట్లే చెప్పుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close