సుజనా బీజేపీలోకి వెళ్తే .. చంద్రబాబుకు చెప్పే వెళ్తారట..!

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి… భారతీయ జనతా పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లుగా.. సూచనలు పంపుతున్నారు. ఎన్నికల సమయంలో.. ఆయన కీలకంగా వ్యవహరించారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో… అలాగే అసంతృప్తులను బుజ్జగించడంలో.. ఆయన నేతృత్వంలోని కమిటీనే చురుకుగా వ్యవహరించింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన సైలెంటయిపోయారు. తాజాగా కొన్ని టీవీ చానళ్లకు.. ఇంటర్యూలు ఇస్తూ.. టీడీపీ అధినేతపై… విమర్శలు చేస్తున్నారు. ఇదే టీడీపీలో కొత్త సంచలనం అయింది.

తెలుగుదేశం పార్టీ అధినేత.. చంద్రబాబు.. మనుషుల కన్నా.. మెషిన్లనే ఎక్కువగా నమ్ముకున్నారని.. సుజనా చౌదరి.. ఓ తెలుగు టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో విమర్శించారు. తాను భారతీయ జనతా పార్టీలోకి వెళ్తే .. పార్టీలో అందరికీ చెప్పే వెళ్తానన్నారు. టీడీపీ అధినేత తీరుపై.. పలు రకాల విమర్శలు చేశారు. అయితే.. ఎక్కడా ఘాటుగా లేకుండా… లోపాలు అన్నట్లుగా ఆయన మాట్లాడారు. చివరిలో బీజేపీకి వెళ్లే ప్రసక్తే లేదని.. గతంలో చెప్పినట్లుగా చెప్పలేదు. వెళ్లేపని అయితే.. అందరికీ చెప్పే వెళ్తానన్నారు. ఈ విషయంలో… ఆయన టోన్‌లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.

సుజనాచౌదరి.. ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. చంద్రబాబుకు సన్నిహితంగా ఉంటూ… పార్టీకి ఆర్థికంగా అండదండలు అందిస్తూ… పైకి వచ్చారనే పేరు ఉంది. అందుకే ఆయనకు.. రాజ్యసభ హోదా మాత్రమే కాదు.. కేంద్రమంత్రి పదవి కూడా చంద్రబాబు ఇప్పించారని అంటున్నారు. అయితే… ఆయనపై ఉన్న వివాదాలు అన్నీ ఇన్నీ కాదు. అనేక ఆర్థిక అవకతవకల కేసులు ఉన్నాయి. ఈడీ వెంటాడుతోంది. ఈ క్రమంలో మరో ఐదేళ్ల పాటు.. వీటిని భరించాలంటే.. సాధ్యమయ్యే పని కాదని.. సుజనా చౌదరి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే బీజేపీ నేతల ఒత్తిడికి తలొగ్గుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏపీలో బీజేపీ ఆపరేషన్ ఇప్పటికి సైలెంట్‌గా జరుగుతోంది. దీని ఫలితం.. త్వరలో చేరిక రూపంలో.. కనిపించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. ‘లేడీస్ స్పెష‌ల్’

ముందు నుంచీ... విభిన్న‌మైన దారినే వెళ్తున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. త‌ను ఎంచుకొనే ప్ర‌తీ క‌థా... తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓవ‌ కొత్త జోన‌ర్ ని ప‌రిచ‌యం చేసింది. 'హ‌నుమాన్' తో పాన్ ఇండియా క్రేజ్...

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close