ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిదే దేశద్రోహం కాదు..! మరి రక్షణ దేశంలో ఉందా..!?

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన దేశ ద్రోహం కిందకు రాదని సుప్రీం కోర్టు తేల్చేసింది. జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై దాఖలైన కేసులో కోర్టు ఈ మేరకు కీలక తీర్పు చెప్పింది. జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, ఎంపీ ఫరూక్‌ అబ్దుల్లా కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుపై మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో ఓ ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడటం ద్వారా ఫరూక్ అబ్దుల్లా దేశద్రోహానికి పాల్పడ్డారని, ఆయనపై చర్యలకు ఆదేశించాలని పిటీషనర్ కోరారు. . దీన్ని విచారించిన జస్టిస్ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషన్‌ కొట్టేస్తూ ఆదేశాలు ఇచ్చింది.

ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు కూడా కీలకంగా ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేయడం దేశద్రోహం కిందకు రాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఫరూక్‌ అబ్దుల్లా ఆర్టికల్‌ 370 పునరుద్ధరణపై చైనా, పాకిస్తాన్‌ మద్దతు తీసుకుంటామని చెప్పినట్లు ఆరోపించిన పిటిషనర్‌ దాన్ని నిరూపించడంలో విఫలమయ్యారు. ఈ కేసు హైలెట్ అవుతోంది. దీనికికారణం ఇటీవల భారత్ లో పెరిగిపోయిన దేశద్రోహం కేసులే. ప్రతీ దానికి దేశద్రోహం అంటూ కేసులు పెట్టడం… వేధించడం కామన్‌గా మారింది.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యక్తం చేసే అభిప్రాయాలను దేశద్రోహంగా పేర్కొంటూ పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు చేస్తున్న ప్రభుత్వాలు, పోలీసులకు ఇది గట్టి షాక్ ఇచ్చేలా ఈ తీర్పు ఉంది. భవిష్యత్తులో ఇలాంటి కేసులు నమోదు చేసే వారికి గుణపాఠంగా కూడా సుప్రీంకోర్టు తీర్పు ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇలాంటి వేధింపుల బారిన పడుతున్న వారికి రక్షణ లభిస్తుందా అన్నదే ప్రశ్న. పోలీసులే ప్రభుత్వాలు.. రాజకీయ నాయకులు చెప్పిన మాటలు విని అమాయకుల్ని.. ప్రభుత్వాలపై పోరాడేవారిని తప్పుడు కేసులతో జైలు పాలు చేస్తున్నారు. ఏపీ సహా.. అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. కేంద్రం కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. రైతుల ఉద్యమం పేరుతో ఎంత మందిపై దేశద్రోహం కేసు పెట్టిందో చెప్పడం కష్టమే.

సుప్రీంకోర్టు మాటలతో కాకుండా.. చేతలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే స్వేచ్చ ప్రజలకు ఉందని నమ్మకం కలిగించే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. లేకపోతే.. గొప్పగా చెప్పుకుంటున్న ప్రజాస్వామ్యం పాలకుల ఇనుప బూట్ల కింద నలిగిపోవాల్సిందే. ప్రజాస్వామ్యం పేరుతో నియంతృత్వం అనుభవించాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close