సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు – వివేకా కేసు మళ్లీ మొదటికి !?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్య కేసులో కీలక నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులసి దాఖలు చేసిన పిటిషన్ మేరకు విచారణ జరిపిన సుప్రీంకోర్టు విచారణాధికారిని మార్చాలని లేదా మరో అధికారిని నియమించాలని సీబీఐ డైరక్టర్‌ను ఆదేశించింది. కేసు స్టేటస్ రిపోర్టును సీబీఐ అధికారులు సమర్పించారు. ఎక్కడ చూసినా రాజకీయ దురుద్దేశమే అని రాశారని.. అలా అయితే నిందితులకు శిక్ష పడదని చెప్పుకొచ్చారు. హత్యకు కుట్రపై విస్తృతంగా దర్యాప్తు చేయలేదని న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. పెద్ద స్థాయిలో దాగి ఉన్న కుట్ర గురించి ఏ మాత్రం దర్యాప్తు చేసినట్లుగా లేదని ధర్మాసనం… స్పష్టం చేసింది. వివేకా హత్య వెనుక ఉన్న సూత్రధారులు.. దాని వెనుక ఉన్న కుట్ర గురించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.

సుప్రీంకోర్టు ఆదేశాలతో కేసు మళ్లీ మొదటికి వచ్చినట్లేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఎలా చూసినా వివేకా హత్య కేసు నిందితులు కోరుకున్నట్లుగా విచారణాధికారి రాంసింగ్ దర్యాప్తు నుంచి వైదొలిగే పరిస్థితి వచ్చినట్లయింది. ఆయన ఈ కేసు విచారణలో ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు. చివరికి ఆయనపై కేసులు కూడా పెట్టారు. చివరికి దర్యాప్తు కీలక దశకు వచ్చిన తర్వాత ఆయనను బదిలీ చేయడం లేదా ఆయన పైన మరో దర్యప్తు అధికారిని నియమించడం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఇప్పటి వరకూ నిందితులు కోరుకున్నది జరిగినట్లవుతుంది.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చూస్తే కుట్రలు, ఉద్దేశాలు, సూత్రదారులలపై సీబీఐ దర్యాప్తు మొదటి నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది. అంటే కేసు విచారణ మళ్లీ మొదటికి వస్తుంది. విచారణ ఆలస్యమైందని.. ఇంకా ఎంత కాలం సాగదీస్తారని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసినప్పటికీ ఈ కేసు మరింత కాలం సాగడం ఖాయంగా కనిపిస్తోంది. కీలక నిందితుల అరెస్ట్ వరకూ వచ్చిన ఈ వ్యవహారం చివరికి మళ్లీ మొదటికి రావడం… అనూహ్యమే అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close