సుప్రీంకోర్టు దెబ్బకి కేరళలో మద్యం వ్యాపారం డమాల్

కేరళ రాష్ట్రంలో క్రమంగా మద్య నిషేధం అమలుచేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని మద్యం వ్యాపారులు మొదట హైకోర్టులో తరువాత సుప్రీం కోర్టులో సవాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. రెండు చోట్ల వారికి ‘చుక్కె’దురయింది. కేరళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యంపాలసీ ప్రకారం ఫైవ్ స్టార్ హోటల్స్ లో తప్ప బయట ఎక్కడా బార్లలో మద్యం అమ్మకాలు నిషేదించబడ్డాయి. మద్యనిషేధం అమలు చేయాలనుకొన్నప్పుడు మళ్ళీ ఫైవ్ స్టార్ హోటల్స్ కి మినహాయింపునిస్తూ తమకే నిషేధం వర్తింపజేయడాన్ని తప్పు పడుతూ మద్యం వ్యాపారులు వేసిన పిటిషన్ ని విచారణకు స్వీకరించిన జస్టిస్ విక్రంజిత్ సేన్, జస్టిస్ శివ కీర్తి సింగ్ లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం కేరళ ప్రభుత్వ నిర్ణయాన్నే సమర్దించింది. మద్యం వ్యాపారుల తరపున అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ముకుల్ రోహాత్గీతో సహా అనేక మంది ప్రముఖ న్యాయవాదులు వాదించినా ఫలితం లేకుండా పోయింది. మద్యనిషేదం కారణంగా నష్టపోతున్న మద్యం వ్యాపారులు అందరికీ ప్రత్యమ్నాయ ఏర్పాట్లను చేయవలసిందిగా సుప్రీం కోర్టు ధర్మాసనం కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కేరళ రాష్ట్రంలో రోజుకి రూ.30 కోట్లు విలువచేసే మద్యం అమ్ముడవుతుంటుంది. రాష్ట్రంలో మద్యనిషేధం అమలుచేయడం మొదలుపెట్టిన తరువాత రూ.4,000 కోట్ల ఆదాయం నష్టపోయింది. రాష్ట్రంలో సుమారు 700కి పైగా బార్లు మూతపడ్డాయి. గత ఆర్ధిక సం.లో కేరళ రాష్ట్రంలో రూ. 9,353.74 కోట్లు విలువ చేసే మద్యం వ్యాపారం జరిగింది. ప్రభుత్వం నిర్ణయం కారణంగా మద్యం వ్యాపారులు, మద్యం ఉత్పత్తి సంస్థలు, వాటిలో పనిచేసే వేలాదిమంది ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది కనుక వారందరూ ఒత్తిడి పెంచడం తధ్యం. అది రాష్ట్రంలో రాజకీయాలను ప్రభావితం చేసి చివరికి అధికారం చేతులు మారాడానికి దారి తీసినా ఆశ్చర్యం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close