బీజేపీకి “ఉద్యమకారుల ఆత్మగౌరవం ” అస్త్రం ఇచ్చిన స్వామిగౌడ్..!

ఉద్యోగ సంఘాల నేతగా తెలంగాణ ఉద్యమంలో సకలజనుల సమ్మెను ఒంటి చేత్తో నడిపిన స్వామిగౌడ్ టీఆర్ఎస్‌కు దూరమయ్యారు. ఆయన ఢిల్లీ వెళ్లి జేపీ నడ్డా సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి.. శాసన మండలి చైర్మన్ ను చేశారు. కానీ ఆ పదవీ కాలం పూర్తియిన తర్వతా పట్టించుకోవడం మానేశారు. పట్టించుకోవడం కాదు.. అసలు లెక్కలోకే తీసుకోలేదని ఆయన ఆవేదన చెందుతున్నారు. బీజేపీలో చేరిన తర్వాత ఆయన బయటకు వచ్చి అదే బాధ వ్యక్తం చేశారు. రెండేళ్ల నుంచి సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్ని స్తున్నా.. ఇంతవరకు అపాయింట్మెంట్ దొరకలేదని బాధపడ్డారు.

తనకు అక్కడ కనీస గౌరవం కూడా లభించడం లేదు కాబట్టి.. ఆత్మగౌరవం కోసమే బీజేపీలో చేరానని స్ఫష్టం చేశారు. తెలంగాణ కోసం ఒక్క నాడు కూడా పోరాడని వారికి కేసీఆర్ పదవులు ఇచ్చారని.. తెలంగాణ కోసం పోరాడిన వారిని పక్కన పెట్టారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యమకారులు కనీస మర్యాదలకు నోచుకోరా అని ప్రశ్నించారు. నిజానికి చాలా మంది టీఆర్ఎస్ మొదటి తరం నేతలది ఇదే అభిప్రాయం. కేసీఆర్ సీనియర్లకు సైతం అపాయింట్‌మెంట్లు ఇచ్చి నెలలు దాటిపోతూ ఉంటుంది.

బంగారు తెలంగాణ కోసం పార్టీలో చేరి పదవులు పొందిన వారు హవా చూపిస్తూండగా.. ఉద్యమంలో కేసీఆర్‌తో పాటు ఉన్న వారు సైడ్ అయిపోయారు. కొంత మందికి పదవులు వచ్చినా.. చివరికి వారు రాజకీయంలో వెనుకబడిపోయారు. అలాంటి వారంతా అవకాశం కోసం చూస్తున్నారు. స్వామిగౌడ్‌కు ఇప్పుడు అవకాశం వచ్చింది. మెరుగైన ప్రత్యామ్నాయం బీజేపీ రూపంలో కనిపిస్తే.. ఉద్యమకారులంతా క్యూ కట్టడం ఖాయం అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

కడప కోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో విస్మయం !

వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు... అందులో ఉన్న పదజాలం చూసి...

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

HOT NEWS

css.php
[X] Close
[X] Close