కోర్టుకు చేరిన స్వరూపానంద “కోకాపేట రెండెకరాల” వ్యవహారం..!

తెలంగాణ ప్రభుత్వం కోకాపేటలో స్వరూపానంద స్వామికి ఎకరానికి రూపాయి చొప్పన రెండు ఎకరాలు కేటాయించడంపై… ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. నిబంధనలకు విరుద్ధంగా రూపాయికే… స్వరూపానందకు.. భూములు కేటాయించారని.. వీరాచారి అనే వ్యక్తి ఈపిటిషన్ వేశారు. ఈ భూముల కేటాయింపు అక్రమమని చెబుతున్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు… ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. నిజానికి స్వరూపానంద ఆశ్రమానికి రెండు ఎకరాల కేటాయింపు వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదమవుతోంది. ఇప్పుడు కోర్టుకు చేరింది.

ప్రభుత్వానికి చెందిన భూములను ఎవరికైనా కేటాయించాలంటే.. నిర్దిష్టమైన కారణాలు ఉండాలి. పరిశ్రమలు స్థాపించి.. ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న వారికో… వృద్ధాశ్రమం పెడతామరో.. సేవా కార్యక్రమాలు చేస్తామనో.. చెప్పి.. భూములు అడగవచ్చు. వారి నిబద్ధత.. ట్రాక్ రికార్డు చూసి.. ప్రభుత్వం భూములు కేటాయిస్తుంది. అలాగే దేశం కోసం.. జీవితాలను త్యాగం చేసిన వారికి నివాస స్థలాలు కేటాయిస్తారు. కొన్ని సార్లు సాగుభూమి కూడా కేటాయిస్తారు. ఇవన్నీ పక్కాగా నిబంధనల ప్రకారం జరుగుతాయి. ఏదైనా.. ప్రజాప్రయోజనాన్నే ప్రధానంగా చూపిస్తారు. కానీ… స్వరూపానంద ఆశ్రమానికి రెండు ఎకరాలను.. ఏ కేటగరిలో.. తెలంగాణ సర్కార్ కేటాయించిదో క్లారిటీ లేదు.

స్వరూపానంద స్వామి.. ఇటీవలి కాలంలో.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అత్యంత సన్నిహితుడయ్యారు. ఆయన … జగన్మోహన్ రెడ్డి కోసం.. ఏకంగా తపస్సు చేశానని చెప్పుకున్నారు. కేసీఆర్ కోసం… రాజశ్యామల యాగాలు చేశారు. ఇద్దరూ గెలిచారు. గెలుపునకు కారణాలు ఏమైనా… స్వరూపానంద పూజలు కూడా కారణమని.. ఇద్దరూ నమ్ముతున్నారు. కేసీఆర్ కోకాపేటలో రెండు ఎకరాలను.. స్వరూపానంద ఆశ్రమానికి.. కేటాయించారు. అమరావతిలో ఆరు ఎకరాలు కావాలని జగన్ కు పిటిషన్ పెట్టుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో.. హైదరాబాద్ రెండెకరాల వ్యవహారం కోర్టుకు చేరడం.. ఆసక్తి రేపుతోంది. ఇటీవలి కాలంలో.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలను కూడా.. హైకోర్టు కొట్టి వేస్తోంది. అందుకే.. ఈ పిటిషన్ న్యాయ వర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close