పాక్ సైనిక స్థావరంపై తాలిబన్ల దాడి, 29మంది మృతి

భారత్ ని అస్థిరపరిచేందుకు పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు తరచూ దానిపైనే దాడులు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు పెషావర్ శివార్లలోగల పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ పై గ్రెనేడ్ లాంచర్లు, ఎకె-47 మిషన్ గన్స్ వాటి అత్యాధునిక ఆయుధాలతో ఉగ్రవాదులు దాడి చేసారు. కానీ పాక్ భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండటంతో వారు ఉగ్రవాదులను త్రిప్పికొట్టారు. భద్రతా దళాల చేతిలో 13 మంది ఉగ్రవాదులు హతం అయ్యారు. కానీ ఉగ్రవాదులు చేసిన ఈ దాడిలో పాక్ ఎయిర్ బేస్ లోని మశీదులో ప్రార్ధనలు చేస్తున్న 16 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 22మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒక సైనికాధికారితో సహా ఆరుగురు భద్రతా సిబ్బంది కూడా ఈ దాడిలో గాయపడ్డారని పాక్ మిలటరీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అసిం బజ్వా తెలిపారు.

ఈ దాడికి తామే బాధ్యులమని తెహ్రీక్-ఈ-తాలిబాన్ ఉగ్రవాద సంస్థ ప్రతినిధి మొహమ్మద్ కుర్శానీ ప్రకటించాడు. తమ ఆత్మాహుతి దాడిలో పాకిస్తాన్ భద్రతా దళాలకు చెందిన 50 మంది వరకు చనిపోయినట్లు అతను ప్రకటించాడు.

షరా మామూలుగానే పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈ దాడిపై తీవ్ర దిగ్బ్రాంతి ప్రకటించిన తరువాత దేశం నుండి ఉగ్రవాదులను ఏరి పారేస్తామని మరోమారు శపథం చేసారు. ఇంతకు ముందు ఇస్లామాబాద్ సమీపంలోగల మిలటరీ స్కూల్ పై ఉగ్రవాదులు దాడి చేసి అందులో సుమారు 147 మంది విద్యార్ధులను అతికిరాతకంగా చంపినప్పుడు, ఆ తరువాత మశీదులు, మార్కెట్ స్థలాలపై ఉగ్రవాదులు దాడులు చేసినప్పుడు కూడా నవాజ్ షరీఫ్ ఇదే విధంగా శపదాలు చేసారు. కానీ నేటికీ ఉగ్రవాదుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.పాకిస్తాన్ వైపు భారత్ కన్నెత్తి చూస్తే, భారత్ కి దశాబ్దాల పాటు గుర్తుండి పోయేవిధంగా గుణపాఠం చెపుతామని హెచ్చరించే పాక్ మంత్రులు, సైన్యాదక్షుడు, ఉగ్రవాదులు పట్టపగలు తమ రక్షణ స్థావరాల మీద దాడులు చేస్తున్నా వారిని ఏమీ చేయలేకపోతున్నారు.

పాక్ ప్రభుత్వం, ఆర్మీ రెండూ కూడా ఉగ్రవాదులతో చాలా విచిత్రమయిన సంబంధాలు నెరుపుతుంటాయి. భారత్ పై దాడులు చేసే ఉగ్రవాదులకు ఒకవైపు రక్షణ, శిక్షణ, సహాసహకారాలు అందిస్తూనే, మరోవైపు వారి ఈవిధంగా చేతిలో చావు దెబ్బలు తిన్నప్పుడు వారిని ఏరిపారేస్తామని ప్రగల్భాలు పలుకుతుంటుంది. ఉగ్రవాదులలో మంచి ఉగ్రవాదులు, చెడ్డ ఉగ్రవాదులు వేరేగా ఉండరని…ఉగ్రవాదులు అందరూ చెడ్డవారనే సత్యాన్ని లోకానికి చాటి చెపుతుంటుంది. కానీ భారత్ లో దాడులు చేసి పారిపోయి వచ్చిన ఉగ్రవాదులకు తనే రక్షణ కల్పించి కంటికి రెప్పలా వారిని కాపాడుకొంటుంది. ఉగ్రవాదుల పట్ల పాకిస్తాన్ అవలంభిస్తున్న ఈ ద్వంద విధానం వలననే పాక్ స్వయంగా వారికి బలవుతోంది. అది స్వయంకృతాపరాధమే కనుక అందుకు ఎవరినీ నిందించలేదు కూడా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close