త‌మ‌న్నా కోసం అనుష్క‌కు అన్యాయం

బాహుబ‌లి 2 లెక్క‌లు మారిపోయాయా? స్క్రిప్టు లో ఉన్న‌ది ఒక‌టి.. రాజ‌మౌళి తీస్తోంది మ‌రొక‌టా? అవున‌నే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. బాహుబలి ది క‌న్ క్లూజ‌న్‌లో త‌మ‌న్నా పాత్ర ఏమాత్రం లేదు. ఫ‌స్టాఫ్‌లో త‌మ‌న్నా… సెకండాఫ్‌లో అనుష్క పాత్ర‌ని హైలెట్ చేయాల‌న్న‌ది రాజ‌మౌళి ప్లాన్‌. అయితే.. అది కాస్త రివ‌ర్స్ అయ్యింద‌ని స‌మాచారం. రెండో భాగంలోనూ త‌మ‌న్నా పాత్ర‌కే ప్రాధాన్యం ఇచ్చార‌ని తెలుస్తోంది. రాజ‌మౌళి స్క్రిప్టు ప్ర‌కారం.. సెకండాఫ్‌లో త‌మ‌న్నా క‌నిపించేది ఒక‌ట్రెండు స‌న్నివేశాల్లోనే. పార్ట్ 1 తీస్తున్న‌ప్పుడే ఆయా స‌న్నివేశాల్ని తెర‌కెక్కించారు. సో.. పార్ట్ 2 షూటింగ్ లో త‌మ‌న్నా పాల్గొనే అవ‌కాశం లేదు. ప్యాచ్ వ‌ర్క్ ఉంటేనే త‌ప్ప సెట్లో అడుగుపెట్టాల్సిన ప‌నిలేదు. కానీ.. పార్ట్ 2కి వ‌చ్చేట‌ప్ప‌టికి త‌మ‌న్నా కోసం కొత్త స‌న్నివేశాలు యాడ్ అయ్యాయి. ఈ భాగంలో కూడా త‌మ‌న్నా రోల్ కీల‌కం గా మార‌నుంది.

త‌మ‌న్నా కోసం కొన్ని యుద్ధ స‌న్నివేశాల్నీ యాడ్ చేశారు. అయితే అవ‌న్నీ అనుష్క చేయాల్సిన సీన్లని అర్థ‌మ‌వుతోంది. సైజ్ జీరో కోసం అనుష్క బాగా బ‌రువు పెరిగింది. బాహుబ‌లి 2 షూటిగ్‌కి ముందు అనుష్క బ‌రువు త‌గ్గి సెట్‌కి రావాలి. కానీ అదేం జ‌ర‌గ‌లేదు. అనుష్క భారీకాయం రాజ‌మౌళిని కొత్త ఆలోచ‌న‌ల్లో ప‌డేసింది. అనుష్క పాత్ర‌ని అలానే ఉంచి.. త‌మ‌న్నా పాత్ర‌కు హైప్ తీసుకొచ్చాడ‌ని, అందులో సెకండాఫ్‌లో త‌మ్మూ పాత్ర నిడివి పెరిగింద‌ని తెలుస్తోంది. అంటే.. త‌మ‌న్నా కోసం అనుష్క‌కి అన్యాయం జ‌రిగింద‌న్న‌మాట‌. అవునా, కాదా అనేది తేలాలంటే బాహుబ‌లి పార్ట్ 2 వ‌చ్చే వ‌ర‌కూ ఆగాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close