హైకోర్టు అధికారాలనే ప్రశ్నిస్తున్న స్పీకర్ తమ్మినేని..!

రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న తమ్మినేని సీతారాం.. తెలుగుదేశం పార్టీతో పాటు.. ఇతరులపై చేస్తున్నట్లుగానే న్యాయవ్యవస్థపైనా వ్యాఖ్యలు చేస్తున్నారు. కోర్టులో పరిపాలిస్తున్నాయని.. ఇక సీఎం.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు ఎందుకంటూ.. వ్యవస్థనే ప్రశ్నించేలా.. తిరుపతిలో మాట్లాడారు. ద్రవ్య వినిమయ బిల్లును టీడీపీ నేతలు అడ్డుకున్నారని కూడా.. శాసనమండలి అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై రాజకీయ దుమారం ప్రారంభమైంది. కోర్టులపై తమ్మినేని సీతారం చేసిన వ్యాఖ్యలపై.. ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ స్పందించారు. చట్టాలు చేయడం శాసన వ్యవస్థ విధి అని.. అవి రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేవా అన్నది చూడాల్సిన పని న్యాయవ్యవస్థదని స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధంగా లేకపోతే.. కోర్టుల నిర్ణయమే ఫైనల్ అవుతుంతుందని స్పష్టం చేశారు.

ఏపీ ప్రభుత్వం ఇటీవలి కాలంలో తీసుకుంటున్న ఎన్నో నిర్ణయాలు రాజ్యాంగ.. చట్ట వ్యతిరేకంగా ఉన్నాయని కోర్టులు కొట్టి వేశాయి. సుప్రీంకోర్టులోనూ ఊరట దక్కడం లేదు. అయితే.. ఈ అక్కసుతో వైసీపీ నేతలు కోర్టులపైనా వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు నోటీసులు జారీ చేయడంతో…వైసీపీ నేతలు కోర్టులపై వ్యాఖ్యలు చేయడం తగ్గిపోయింది. కానీ స్పీకర్ పదవిలో ఉన్న తమ్మినేనికి ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి. ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటారు. అందుకే.. ఎలాంటి వ్యాఖ్యలు చేసిన చెల్లిపోతుదంన్న ఉద్దేశంతో.. ఆయనను వైసీపీ ముందు పెడుతోందన్న ప్రచారం జరుగుతోంది. వ్యాయవ్యవస్థను సైతం వైసీపీ బ్లాక్‌మెయిల్ చేస్తోందని.. ఇటీవలి కాలంలో విపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి.

మరో వైపు శాసనమండలిలో టీడీపీనే ద్రవ్య వినిమయ బిల్లు అడ్డుకుందంటూ.. ఆయన చేసిన ఆరోపణలను టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఖండించారు. మండలిలో టీడీపీ సభ్యులు 30 సార్లు ద్రవ్య వినిమయ బిల్లు పెట్టాలని కోరారని.. ఆ విషయం రికార్డుల్లో ఉంటుందన్నారు. స్పీకర్ స్థానంలో ఉండి అబద్దాలు చెప్పడం .. సరి కాదన్నారు. మొత్తానికి తమ్మినేని సీతారం.. స్పీకర్ స్థానంలో ఉండి.. చంద్రబాబుపై.. సోనియాపై .. టీడీపీపై ఇష్టం వచ్చినట్లుగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంలోనే కాదు.. న్యాయవ్యవస్థపైనా అదే తరహా వ్యాఖ్యలు చేస్తూ కొత్త వివాదం సృష్టిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close