టిడిపి నేతల వర్గీక’రణం’

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఎదురుదెబ్బలు కాపునాడు కల్లోలం రాజధాని గజిబిజి వంటివాటితోనే ఉక్కిరిబిక్కిరవుతుంటే ఇప్పుడు అదనంగా ఎస్‌సి రిజర్వేషన్లపై వివాదం రాజుకుంటున్నది. అది కూడా అధికార పక్షంలో అంతర్గత ఘర్షణగా మారడం మరింత ఇబ్బందికరమవుతున్నది. తన హయాంలో వర్గీకరణ చేసిన చంద్రబాబు తర్వాత ఆమోదం పొందలేకపోయారు. ఇప్పటికీ కేంద్రం దాన్ని పక్కనపెడుతున్నది. వివిధ సందర్భాలలో వర్గీకరణ సమస్య ముందుకు వస్తూనే వుంది. తాజాగా మాదిగదండోరా నాయకుడు మందకృష్ణ దీనిపై అల్టిమేటం జారీ చేశారు. అధికారికంగా స్పందన వచ్చేలోగానే వ్యవసాయమంత్రి పత్తిపాటి పుల్లారావు మందకృష్ణపై విమర్శలు గుప్పించారు. ఆ అవకాశమే లేదని తోసిపారేశారు. పుల్లారావు వ్యాఖ్యలపై కృష్ణమాదిగ స్పందించడానికి ముందే సంక్షేమ శాఖా మంత్రి రావెల కిశోర్‌బాబు వాటిని కొట్టిపారేశారు.తమ ప్రభుత్వం వర్గీకరణకు కట్టుబడి వుందని ఆ విషయాలు మాట్లాడేందుకు తామంతా వున్నామని చెప్పారు.కొంతకాలం కిందట టిడిపిలో చేరిన మాజీ కాంగ్రెస్‌ మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ మరింత తీవ్ర స్తాయిలో పత్తిపాటి పుల్లారావు పై విరుచుకుపడ్డారు. మీశాఖలో అనేక సమస్యలు వుంటే మా సంగతి మీకెందుకని ఆక్షేపించారు. రావెల, పీతల సుజాత వంటివారు మాట్లాడతారని వ్యాఖ్యానించారు.

ఇంతలో గృహనిర్మాణ కార్పొరేషన్‌ అద్యక్షుడు దళిత నేత వర్ల రామయ్య డొక్కా వరప్రసాద్‌పై ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ నుంచి వచ్చిన మీకు ఇంకా తెలుగుదేశం పద్ధతులు అలవడలేదని ఎద్దేవా చేశారు. వర్గీకరణ సమస్య తమ అధినేత చూసుకుంటాడని మందకృష్ణ సలహాలు అవసరం లేదని విమర్శించారు. మరో వైపున మందకృష్ణ 48 గంటల్లోగా వర్గీకరణపై వైఖరి చెప్పకపోతే తమ వాళ్లతో కలసి కార్యాచరణ ప్రకటిస్తానని ‘అల్టిమేటం’ జారీచేశారు.ఈ విషయంలో ఆయనకు ప్రధాన ప్రత్యర్థి ఎస్‌సి సంక్షేమ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకరరావు ఎదురుదాడి చేయడమే తరువాయి. ఏమైనా కాపుల రిజర్వేషన్‌ సమస్యతో మొదలుపెట్టి కులాల వారీ సమస్యలు వరుసగా పెరిగే సంకేతాలు స్పష్టం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స్మూత్ గా ఓట్ల బదిలీ ఖాయం – ఫలించిన కూటమి వ్యూహం !

ఏపీలో ఎన్డీఏ కూటమి మధ్య ఓట్ల బదిలీ సాఫీగా సాగిపోయే వాతావరణం కనిపిస్తోది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని అనుకున్నప్పుడు చాలా మంది ఓటు బదిలీపై...

బెట్టింగ్ రాయుళ్ల టార్గెట్ ప‌వ‌న్‌!

ఏపీ మొత్తానికి అత్యంత ఫోక‌స్ తెచ్చుకొన్న నియోజ‌క వ‌ర్గం పిఠాపురం. ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డి నుంచి పోటీ చేయ‌డంతో పిఠాపురం ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ అయ్యింది. గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం,...

ప్రధాని రేసులో ఉన్నా : కేసీఆర్

ముఖ్యమంత్రి పదవి పోతే పోయింది ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడతానని కేసీఆర్ అంటున్నారు. బస్సు యాత్రతో చేసిన ఎన్నికల ప్రచారం ముగియడంతో .. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ...

ఎక్స్ క్లూజీవ్‌: ర‌ణ‌వీర్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ‌… ‘బ్ర‌హ్మ‌రాక్ష‌స‌’

'హ‌నుమాన్' త‌రువాత ప్ర‌శాంత్ వ‌ర్మ రేంజ్ పెరిగిపోయింది. ఆయ‌న కోసం బాలీవుడ్ హీరోలు, అక్కడి నిర్మాణ సంస్థ‌లు ఎదురు చూపుల్లో ప‌డిపోయేంత సీన్ క్రియేట్ అయ్యింది. ర‌ణ‌వీర్ సింగ్ తో ప్ర‌శాంత్ వ‌ర్మ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close