కింకర్తవ్యం..! దిక్కు తోచని స్థితిలో టీడీపీ..!

తెలుగుదేశం పార్టీలో నిశ్మబ్ద వాతావరణం ఏర్పడింది. తమకు ఇంత దారుణమైన ఫలితాలు వస్తాయని ఎవరూ ఊహించ లేదు. రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా పది శాతం వరకూ ఉండటం.. వారిని మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతానికి టీడీపీ హైకమాండ్ పోస్ట్ మార్టం గురించి ఆలోచించడం లేదు. త్వరలోనే కార్యాచరణ ఉండొచ్చని చెబుతున్నారు. అగ్రనేతలు సహా… జిల్లా స్థాయి నేతలందరూ ఫలితాలను చూసి.. దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు. ఎందుకిలా జరిగిందనే దానిపై.. అంతర్గతంగా పరిశీలన చేసుకోవడానికి ప్రాదాన్యం ఇస్తున్నారు.

ఓటమి ఇంత భయంకరమా..?

తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం కూడా.. ఈ ఫలితాల విషయంలో షాక్‌లో ఉంది. సంక్షేమ పథకాలు పొందిన వాళ్లు కూడా ఓట్లు వేయలేదని.. పార్టీకి వచ్చిన ఓట్ల శాతంతో తేలింది. ఇలా ఎందుకు జరిగిందని ఆరా తీస్తోంది. ప్రదానంగా.. పార్టీ యంత్రాంగం.. ఎన్నికల విషయంలో..నిర్లక్ష్యంగా వ్యవహరించారని… సంక్షేమ పథకాలు పొందిన వారితో ఓట్లు వేయించుకునే విషయాన్ని పట్టించుకోలేదని భావిస్తున్నారు. ఈ లోపే వైసీపీ నేతలు వారిని ప్రలోభాలకు గురి చేసి.. ఓట్లు వేయించుకున్నారనే అంచనాకు వస్తున్నారు. ఏ ఎన్నిక జరిగినా.. టీడీపీ హైకమాండ్ పోస్ట్ మార్టం నిర్వహిస్తుంది. అయితే.. ప్రస్తుత ఎన్నికల ఓటమి ప్రభావం.. హైకమాండ్‌ను సైతం షాక్‌కు గురి చేయడంతో.. వారు కూడా మౌనం పాటిస్తున్నారు.

తప్పెక్కడ జరిగింది..?

తెలుగుదేశం పార్టీ ప్రతీ విషయాన్ని పక్కాగా రికార్డు చేసుకుంటుంది. అధ్యక్షుడి దగ్గర్నుంచి కార్యకర్తల వరకూ.,.. కమ్యూనికేషన్ పటిష్టంగా ఉంటుంది. పార్టీకి సంబంధించి సమాచారం అంతా ఎప్పటికప్పుడు.. అప్ డేట్ అవుతూ ఉంటుంది. ఈ కారణాల వల్ల.. తెలుగుదేశం పార్టీ… అంచనాల్లో అంతో ఇంతో స్పష్టత ఉంటుంది. ఈ సారి కూడా అలాంటి స్పష్టత ఉంది. గెలుపు దిశగా ఉన్నామనే క్షేత్ర స్థాయి సమాచారం పార్టీకి వచ్చింది. నియోజకవర్గ నేతలు కూడా అదే పంపారు. కానీ ఫలితాలు మాత్రం పూర్తి భిన్నంగా వచ్చాయి. గెలుస్తామని అనుకున్న కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీకి భారీ మెజార్టీలు రావడం..వారిని షాక్‌కు గురి చేసింది. అందుకే తప్పు ఎక్కడ జరిగిందా.. అని గ్రామాల వారీగా విశ్లేషించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫలితాలపై మీడియాతో మాట్లాడటానికి ఎవరూ ఆసక్తి చూపించడం లేదు.

చంద్రబాబును కదిలించే ప్రయత్నం చేయని నేతలు..!

కౌంటింగ్ ముందు వరకూ.. గెలుపు ఉత్సాహంతో ఉన్న టీడీపీలో… ఇప్పుడు.. పిన్ డ్రాప్ సైలెన్స్ నెలకొంది. తాము ఏం తప్పు చేశామని… ఆవేదన చెందేవారు ఎక్కువ మంది ఉన్నారు. మరికొంత మంది రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనని..సర్ది చెప్పుకుని..రోజువారీ రాజకీయాల్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితి టీడీపీ నేతలకు అనూహ్యంగానే ఉంది. టీడీపీ అధినేతను.. ఈ సమయంలో ఎవరూ కదిలించే ప్రయత్నం కూడా చేయడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close