పరిచయాలు పెంచుకుంటున్న టీడీపీ, జనసేన క్యాడర్ !

పై స్థాయిలో మాట్లాడుకుని పొత్తులు పెట్టుకుంటే సరిపోదు.. ఓట్ల బదిలీ జరగాలంటే కింది స్థాయిలో నాయకుల మధ్య సమన్వయం ఉండాలి… ఈ విషయాన్ని టీడీపీ, జనసేన పార్టీలు ముందుగానే గుర్తించాయి. పొత్తు ప్రకటన చేసిన వెంటనే ఆ పార్టీల నాయకత్వాలు… కింది స్థాయి వరకూ కలసిపోయే కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. అందులో భాగంగా జిల్లా స్థాయి సమన్వయ సమావేశాలు మొదట ప్రారంభమయ్యాయి. ఇవి పూర్తయిన తర్వాత నియోజకవర్గ .. మండల, గ్రామ స్థాయిలో పార్టీల నేతలు క లిసి పని చేసుకునే వాతావణాన్ని ఏర్పాట్లు చేసుకునే చాన్స్ ఉంది.

ఎన్నికల్లో ప్రజల ఆదరణ పొందడం అంటే… తమ ఓటర్లను.. తమకు ఓటు వేసే వాళ్లను పోలింగ్ బూత్ వరకూ వచ్చేలా చేసుకోవడం. ఇది ఎలక్షనీరింగ్. ఇలాంటి విషయాల్లో సక్సెస్ కావాలంటే కింది స్థాయి వరకూ పార్టీ నిర్మాణం ఉండాలి. జనసేన పార్టీకి ఇలాంటి నిర్మాణం లేదు. అందుకే గత ఎన్నికల్లో ఫ్యాన్స్ తో కూడా ఓటు వేయించుకోలేకపోయారు. ఫలితంగా ఆరు శాతం ఓట్లకే పరిమితమయ్యారు. స్వచ్చంగా తిరుగులేని అభిమానం ఉన్న వారు మాత్రమే ఓటు వేశార.. కానీ రాజకీయం అంటే… తమ ఓటు పక్కకుపోకుండా చూసుకోవడం కూడా కీలకమే.

వచ్చే ఎన్నికల్లో ఇలాంటి తప్పులు జరగకుండా.. టీడీపీ, జనసేన పొత్తులు పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యేలా… ఓట్ల బదిలీ జరగడానికి సమన్వయ సమావేశాలు ఉపయోగపడతాయి. అందుకే వీటిని సీరియస్‌గా నిర్వహిస్తున్నారు. ఇలాంటి గ్రౌండ్ వర్క్ పకడ్బందీగా చేస్తే.. అద్భుత ఫలితాలు వస్తాయని.. టీడీపీ, జనసేన నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close