కోల్‌కతాలో ఏపీ ఇసుక టెండర్లు – రాజధాని అక్కడకు మార్చారా ?

ఆంధ్ర ఇసుకను దోపిడీ చేయడానికి కోల్ కతాలో టెండర్లు వేశారు. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా నిజం. ఏం.. ఏపీ సర్కార్ తమ రాజధానిని కోల్‌కతాకు మార్చిందా.. ఆ జీవో ఏమైనా రహస్యంగా ఉంచారా అన్న డౌట్లు ఇలాంటివి విన్నప్పుడే వస్తూంటాయి. ఏపీ ఓ రాష్ట్రం. దానికో రాజధాని ఉంది. ఆ రాజధాని గుర్తించడానికి ప్రభుత్వానికి ఇష్టం లేకపోతే… చాలా నగరాలు ఉన్నాయి. టెండర్ నిర్వహించే కంపెనీ బ్రాంచులు కూడా ఉన్నాయి. అయినా కోల్ కతాలో ఎందుకు పెట్టారు ?

గత ప్రభుత్వంలో ఉచితంగా ఇచ్చిన ఇసుకతో ఈ ప్రభుత్వం తైలం పిండుతోంది. ప్రజల ఉపాధిని పణంగా పెట్టి వేల కోట్లు అధికార పార్టీ నాయకులు దోచుకుంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు లెక్క చేయకుండా తవ్వేసుకుంటున్నారు. ఒకే సంస్థకు ఇసుకను కట్టబెట్టేందుకు కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ జేపీ సంస్థ పేరుతో తవ్వుకున్నారు. ఇప్పుడు మళ్లీ టెండర్లు పెలిచి… జగన్ రెడ్డి సోదరుడు అనిల్ రెడ్డికి కట్టబెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయనకు అనుకూలంగా టెండర్ రూల్స్ మార్చి ప్రయత్నిస్తున్నారు. దీనిపై దుమారం రేగుతోంది.

ఇసుక దోపిడీకి చేస్తున్న ప్రయత్నాలన్నీ కళ్ల ముందే ఉండటంతో… టీడీపీ నేతుల సీబీఐ, విజిలెన్స్ లకు ఫిర్యాదు చేశారు. అయితే బీజేపీ అధ్యక్షురాలు ఫిర్యాదు చేస్తనే పట్టించుకోరు. ఇక వీరు చేస్తే పట్టించుకుంటారా అన్న డౌట్ సామాన్యులకు వస్తుంది. కానీ కళ్ల ెదుట జరుగుతున్న దోపిడీకి సాక్ష్యాలు కనిపిస్తున్నా సైలెంట్ గా ఉన్నారని ప్రజలకు తెలిసే వ్యూహంతోనే వారు ఫిర్యాదులు చేస్తున్నారని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close