ప్రాణభయంతో దేశం విడిచి వెళ్లిన పట్టాభి !?

టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాల్దీవ్స్ వెళ్లారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.  ఆయన విమానం ఎక్కినప్పటి నుండి దిగిన వరకూ ఆయనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. ఓ పార్టీ సానుభూతిపరులు వాటిని పెట్టారు. అయితే అవి ఇప్పటివా.. పాతవా అన్నదానిపై స్పష్టతలేదు. ఆయన కుటుంబసభ్యులు కానీ.. టీడీపీ కానీ ఈ అంశంపై స్పందించలేదు. బెయిల్ పై వచ్చిన తర్వాత పట్టాభి ఆజ్ఞాతంలోకి వెళ్లారు.

కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు  ప్రాణానికి ముప్పు ఉందని స్పష్టమైన సమాచారం రావడంతోనే ఆయన వెంటనే ఆజ్ఞాతంలోకి వెళ్లారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. బెయిల్ వచ్చిన రోజున రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంటికి వెళ్లాలనుకున్నారు. కానీ ముప్పు ఉందన్న సమాచారంతో ఆయన వెనక్కి వచ్చేశారు. ఆ తర్వాత పోలీసులు  ఆయనతో పాటు వస్తున్న వాహనాలన్నింటినీ నిలిపివేశారు. కానీ పట్టాభి ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

అప్పట్నుంచి పట్టాభి ఎవరికీ కనిపించలేదు. ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లారని మాత్రం తెలుస్తోంది. ఇప్పుడు ఆయన మాల్దీవ్స్‌కు వెళ్లారన్న ప్రచారం ప్రారంభమైంది.  ఆయన ప్రాణభయంతో మాల్దీవులకు వెళ్లి ఉంటే ఉండవచ్చని టీడీపీ నేతలు భావిస్తున్నారు. పట్టాభి విదేశాలకు వెళ్లడానికి చట్టపరమైన ఆటంకాలు ఏమీ లేవు. ఆయనపై విదేశాలకు వెళ్లకుండా అడ్డుకునేంత కేసులు ఏమీ లేవు. ఆయన తన ఇష్టానికి ఎక్కడికైనా వెళ్లగలరు. అయితే ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితుల్లో ఆయన ఆజ్ఞాతంలో ఉండటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడమే ఆసక్తికరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మా రాష్ట్రానికి రండి… రేవంత్ కోసం 7 రాష్ట్రాల రిక్వెస్ట్!

గెల‌వ‌టం అసాధ్య‌మ‌నుకున్న తెలంగాణ‌లో పార్టీని గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డికి... ఇత‌ర రాష్ట్రాల నుండి మా రాష్ట్రానికి రండి అంటూ ఇన్విటేష‌న్లు వ‌స్తున్నాయి. మా రాష్ట్రంలో తెలుగు వారున్నారు మీరు రండి అంటూ...

నేల దిగిన విక్ర‌మ్‌… ఈసారి కొట్టేస్తాడేమో..?!

విక్ర‌మ్ న‌టుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ప్ర‌తీసారీ ఏదో ఓ రూపంలో కొత్త‌ద‌నం ఇవ్వాల‌నే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంటాడు. అదే త‌న ప్ల‌స్సు, అదే మైన‌స్సు కూడా. మితిమీరిన ప్ర‌యోగాల‌తో చేతులు కాల్చుకోవ‌డం...

మోత్కుపల్లి ఏ పార్టీలో ఉన్నా అంతే !

మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో మాదిగలకు అన్యాయం జరుగుతోందని.. మఖ్యమంత్రి రేవంత్ తప్పు చేస్తున్నారని తెరపైకి వచ్చారు. ఒక రోజు దీక్ష చేస్తానని ప్రకటించారు. నిజానికి మోత్కుపల్లి...

తగ్గేదేలే – తోట త్రిమూర్తులే అభ్యర్థి !

దళితుల శిరోముండనం కేసులో దోషిగా తేలి జైలు శిక్షకు గురైన మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిముర్తులకు జగన్ అభయం ఇచ్చారు. జైలు శిక్ష పడినా అభ్యర్థి ఆయనేనని స్పష్టం చేయడంతో ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close