అసెంబ్లీ లో చిరంజీవి ప్రస్తావన, రాష్ట్రానికి చిరు ఏం చేశాడో చెప్పిన టీడీపీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నదీ పరివాహక ప్రాంతాల లో నిర్మించిన కట్టడాలను మూసివేయాలని ఇటీవల జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ తెలుగుదేశం పార్టీ నేత ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చిరంజీవి పేరును ప్రస్తావిస్తూ, కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విడుదల చేసిన వేల కోట్ల నిధుల గురించి కూడా మాట్లాడారు. వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నదీ పరివాహక ప్రాంతాల్లో ఎన్నో ప్రభుత్వ భవనాలతోపాటు, వందల ఏళ్లుగా ఉన్న ప్రైవేటు కట్టడాలు సైతం ఉన్నాయని, ముఖ్యమంత్రి జగన్ వీటిని కూల్చివేస్తామని చేస్తున్న ప్రకటనల వల్ల ప్రజలలో ఆందోళన నెలకొందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. లోటు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రంలో ప్రజా ధనం తో కట్టిన ప్రభుత్వ భవనాలను కూల్చడం ఏంటి అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైయస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలోనే గోదావరి నదికి కేవలం 5 మీటర్ల దూరంలో దిండి రిసార్ట్స్ కట్టడానికి అనుమతిని ఇచ్చారని ఎమ్మెల్యే ప్రభుత్వానికి గుర్తు చేశారు. కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాలలో అనేక ప్రైవేటు భవనాలు, హోటల్స్ కట్టడానికి రాజశేఖర్రెడ్డి హయాంలో అనుమతులు ఇచ్చారని, ఆ హోటళ్ల పేర్లతో సహా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గుర్తు చేశారు.

ఇక అదేవిధంగా చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం కోసం వెయ్యి కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారని, దీంతో మెగా టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయడానికి ఆయన కృషి చేశారని, ఆ నిధులతో నే కోవూరు, కోటిపల్లి లాంటి చోట్ల అనేక ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయని, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గుర్తు చేశారు. జగన్ నది పరివాహక ప్రాంతాల్లోని కట్టడాలన్నీ కూల్చివేయాలని అంటే ఇలా వేలకోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటైన ప్రాజెక్టులను కూడా కూల్చివేయాల్సి వస్తుందని ఆయన అన్నారు.

సరైన మీడియా అండ లేకపోవడంతో తాను చేసిన మంచి పనులను కూడా మెగాస్టార్ చిరంజీవి ప్రజలకు సరిగ్గా వివరించలేకపోయారు. ఏదేమైనా మెగాస్టార్ చిరంజీవి రాష్ట్రానికి ఏం చేశారు అని పదేపదే ప్రశ్నించే రాజకీయ పార్టీలు, వారి ఆధీనంలోని మీడియా చానల్స్ కి, ఇప్పుడు ఆ రాజకీయ పార్టీల లోని ఒక ఎమ్మెల్యే నే సమాధానం ఇచ్చే పరిస్థితి రావడం విశేషం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. ‘లేడీస్ స్పెష‌ల్’

ముందు నుంచీ... విభిన్న‌మైన దారినే వెళ్తున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. త‌ను ఎంచుకొనే ప్ర‌తీ క‌థా... తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓవ‌ కొత్త జోన‌ర్ ని ప‌రిచ‌యం చేసింది. 'హ‌నుమాన్' తో పాన్ ఇండియా క్రేజ్...

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close