ఏపీలోనే ఈవీఎంల సమస్య ఎందుకొచ్చింది..? టీడీపీని వేధిస్తున్న సందేహం..!

ఉదయం పది గంటలకు 35 శాతం ఈవీఎంలు మొరాయించాయి. పదకొండు గంటలకు 45 ఈవీఎంలు మాత్రమే పని చేయలేదు. ఇదీ సీఈసీ అరోరా ఏపీ ఎన్నికల గురించి చెప్పిన మాట. అంటే… పది గంటల వరకూ.. 35 శాతం ఈవీఎంలు పని చేయలేదని ఆయనే అంగీకరించారు. ఈ స్థాయిలో.. ఈవీఎంల సమస్య.. ఏ రాష్ట్రంలోనూ రాలేదు. తొలి విడతలోనే ఎన్నికలు జరిగిన తెలంగాణలో, రెండో విడతలో జరిగిన కర్ణాటక, తమిళనాడుల్లో కూడా ఈవీఎంల సమస్యలు పెద్దగా రాలేదు. ఒకటి రెండు చోట్ల మొరాయించిన పోలింగ్ సాఫీగానే జరిగింది. కానీ ఏపీలోనే అలా ఎందుకు జరిగిందన్నది టీడీపీ నేతలకు అర్థం కాని విషయం.

భెల్, ఈసీఐఎల్ ఇంజనీర్లు నియోజకవర్గానికి ముగ్గురు ఉన్నప్పటికీ వారు అనేక ప్రాంతాల్లో సమస్యలు రావటంతో బాగు చేయటం ఆలస్యమైంది. దీంతో పోలింగ్ మరుసటి రోజు తెల్లవారుజాము వరకు జరిగింది. ఈవీఎంలలో వచ్చిన సాంకేతిక లోపాలతో కొన్ని ప్రాంతాల్లో వాటిని మార్చినప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో అవి తరచూ సమస్యలు వస్తూనే ఉన్నాయి. గంటకోసారి సాంకేతిక సమస్య తలెత్తి పోలింగ్ సిబ్బందిని, ఓటేసేందుకు వచ్చిన ఓటర్లను ఇబ్బందిపెట్టాయి. వందలాది పోలింగ్ కేంద్రాల్లో ఈ సమస్య తలెత్తింది. మంగళగిరి నియోజకవర్గంలో ఏకంగా నలభై పోలింగ్‌బూత్‌లలో ఈ సమస్య వచ్చింది. ఈవీఎంల్లో ఏర్పడిన సాంకేతిక సమస్యలను సరిదిద్దేందుకు సాయంత్రం 4 గంటల వరకు సాంకేతిక నిపుణులు పరుగులు తీస్తూనే ఉన్నారు. ఏపీలో పోలింగ్ తీవ్ర గందరోగళం మధ్య ముగిసింది.

రెండో విడత పోలింగ్ జరిగిన పశ్చిమబెంగాల్, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఈవీఎంల్లో సాంకేతిక సమస్యలు వచ్చినా.. అవి ఏపీలో వచ్చినంత తీవ్రమైనవి కావు. ఒకట్రెండు ప్రాంతాల్లో సాంకేతిక సమస్య తలెత్తినప్పటికీ వాటిని వెంటనే సరిదిద్దారని కూడా సమాచారం అందింది. దీంతో తెలుగుదేశం వర్గాలు ఇప్పటివరకు తాము అనుమానిస్తున్న కారణాలు నిజమేననే నిర్ణయానికి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లో కావాలనే సాంకేతిక సమస్యలున్న ఈవీఎంలను ఉపయోగించారని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close