సీఐడీపై టీడీపీ ఎదురు కేసుకు రెడీ అయిందా..!?

చంద్రబాబుపై సీఐడీ ఫేక్ కేసులు పెట్టిందని కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ రోజుకో ఆధారం బయట పెడుతోంది. పెద్ద ఎత్తున ఎస్సీలు నష్టపోయారని.. వారంతా తనకు ఫిర్యాదులు చేశారని అందుకే తానుసీఐడీకి ఫిర్యాదు చేసినట్లుగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. అయితే ఆయనకు ఫిర్యాదు చేసిన వాళ్లు ఎవరూ రాజధానికి భూములు ఇచ్చిన వారు కాదని రెండు రోజుల కిందట.. టీడీపీ ప్రకటించారు. సర్టిఫైడ్ ఎఫ్‌ఐఆర్ కాపీ తీసుకుని అందులో ఉన్న వివరాలన్నింటినీ వెరీఫై చేసుకుంటున్న టీడీపీ.. వీడియో సాక్ష్యాలను కూడా రెడీ చేసుకుంటోంది. వీటన్నింటినీ ప్రణాళిక ప్రకారం ప్రజల ముందు ఉంచుతోంది.

తాము రాజధాని భూములను బలవంతంగా తీసుకోవడం వల్ల.. లేక ఇతర కారణాల వల్ల నష్టపోయామని పేర్కొన్న ఐదుగురు రైతుల గురించివివరాలను టీడీపీ సేకరించింది. అందులో రెండు కుటుంబాలు అసలు ఎస్సీ కాదని టీడీపీ నేతలు చెబుతున్నారు. మూడు కుటుంబాలు.. తాము అసలు ఫిర్యాదుచేయలేదని… తమ భూమి అమ్ముకున్నామో లేదో వివరాలు తెలుసుకోవడానికి వచ్చి సంతకాలు పెట్టించుకున్నారని… రాజకీయాలకు తమకు సంబంధం లేదని అంటున్నారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లోనూ అదే చెప్పామని అంటున్నారు. ఈ వీడియోలను టీడీపీ విడుదల చేసింది. ఇప్పుడు మొత్తంగా.. చంద్రబాబు టార్గెట్‌గా సీఐడీ అధికారులు.. ఆళ్ల రామకృష్ణారెడ్డితో కలిసి కుట్ర పన్నారని.. స్పష్టమైన ఆధారాలు లభించాయని టీడీపీ నేతలు నమ్ముతున్నారు.

వీటిని ఇలా ప్రజల ముందు పెట్టడమే కాకుండా… సీఐడీపై… ఎదురు కేసులు వేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ అంశంపై న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. రాజకీయ కుట్రలను పోలీసు అధికారులు అమలు చేస్తున్న వైనం… పోలీసు యంత్రాంగం మొత్తాన్ని ఓ సలహాదారుడు.. రాజకీయం కోసం వాడుకుంటున్న వైనం బయటకు రావాలంటే.. సీఐడీని కోర్టుకు లాగాల్సిందేనని టీడీపీ నేతలు పట్టుదలగా ఉన్నారు. మొత్తంగాచంద్రబాబును ఇరికించాలని అనుకున్నారు కానీ.. ఈ కేసు రివర్స్‌లో వెళ్లే అవకాశం కనిపిస్తోందన్న ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో మంత్రులు ఫెయిల్..!?

కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ గా ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తిపోస్తున్నా ఒకరిద్దరూ మంత్రులు మినహా మిగతా వారెవరూ పెద్దగా స్పందించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. వీటన్నింటికి రేవంత్ ఒక్కడే కౌంటర్ ఇస్తున్నారు తప్పితే మంత్రివర్గం...

ఇలా అయితే కుదరదు మార్చాల్సిందే…త్వరలో సీఎం రేవంత్ కీలక నిర్ణయం

తెలంగాణ సీఎంవోను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారా..? ఫైల్స్ క్లియరెన్స్ లో అధికారుల నిర్లక్ష్యంపై ఫిర్యాదులు అందటంతో సమర్ధవంతమైన అధికారులను నియమించాలని ఫిక్స్ అయ్యారా..? ఎన్నికల కోడ్ ముగియగానే సీఎంవోలో...

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close