గంటా టార్గెట్ ఉపఎన్నికే..!

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పీకర్ తమ్మినేని సీతారాం పిలవకపోయినా .. ఆయన సొంత ఊరు ఆముదాల వలస వెళ్లారు. ప్రత్యేకంగా సమయం తీసుకుని వెళ్లి కలిశారు. తాను పంపిన రాజీనామా లేఖను పరిశీలించి.. వెంటనే ఆమోదించాలని కోరారు. స్పీకర్ ఫార్మాట్‌లో ఇచ్చానని… కూడా గుర్తు చేశారు. అయితే తాను రాజీనామా లేఖను ఇంకా పరిశీలించలేదని అమరావతి వెళ్లిన తర్వాత పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని తమ్మినేని సీతారం.. గంటా శ్రీనివాసరావుకు చెప్పి పంపించారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. ప్రజా ప్రతినిధుల రాజీనామాలతోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందని ఆయన అంటున్నారు.

తనతో పాటు అందరూ రాజీనామాలు చేయాలని… ఇదే రాజీనామాలకు సరైన సమయం అని గంటా కొంత కాలంగా పిలుపునిస్తున్నారు. ఒందరిపై ఒత్తిడి పెరగాలంటే.. తన రాజీనామాను ఆమోదించుకోవడమే మార్గమని ఆయన అంటున్నారు. స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామాలు చేసే ప్రజా ప్రతినిధులపై.. టీడీపీ పోటీ పెట్టదని ఆయన చాలా సార్లు ప్రకటించారు కూడా. ఇప్పుడు తమ్మినేనిని కలిసిన తర్వాత కూడా అదే చెబుతున్నారు. తన నియోజకవర్గం నుంచి తాను మళ్లీ పోటీ చేయబోనని… స్టీల్ ప్లాంట్ జేఏసీ ఎవరు ప్రతిపాదిస్తే వారికే మద్దతిస్తానని ప్రకటించారు. స్పీకర్ తమ్మినేని సీతారం.. ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు.

అధికార పార్టీకి ఇబ్బందికరం అయితే.. ఆయన ఆమోదించడానికి అనుమతి రాదు. అందుకే.. ఈ అంశఎంపై… ప్రభుత్వ పెద్దలు ఏం చెబితే.. దాని ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గంటా రాజీనామాను ఆమోదిస్తే.. టీడీపీకి ఓ ఎమ్మెల్యే తగ్గిపోతారు. అయితే.. ఒక వేళ అక్కడ ఉపఎన్నిక జరిగితే స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ పెరుగుతుంది. ఈ కారణంగా రాజీనామాను ఆమోదించడానికి ప్రభుత్వ వర్గాలు సిద్ధంగా లేవన్న ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

వైసీపీ ఘోర పరాజయం ఖాయం – జగన్‌కు ఎప్పుడో చెప్పా : ప్రశాంత్ కిషోర్

ఏపీ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ తన అంచనాను మరోసారి చెప్పారు. వైసీపీ ఘోర పరాజయం ఖాయమని అన్నారు. ఈ విషయాన్ని తాను ఏడాదిన్నర కిందటే జగన్ కు చెప్పానని స్పష్టం చేశారు. ఆర్టీవీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close