సీఎంల భేటీల‌పై విప‌క్షాలు ఎందుకు స్పందించ‌డం లేదు..?

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఆంధ్రా సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి… ఇద్ద‌రూ ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో భేటీ కావ‌డం, ఇరు రాష్ట్రాల మ‌ధ్య అప‌రిష్కృతంగా ఉన్న అంశాల‌పై చ‌ర్చించ‌డం, ముందుగా నీటి వ‌న‌రుల సద్వియోగంపై మొన్న‌నే చ‌ర్చించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌రువాత‌, రెండు రాష్ట్రాల‌కు చెందిన ఉన్నతాధికారులు స‌మావేశ‌మ‌య్యారు. గోదావ‌రి నుంచి శ్రీశైలం జ‌లాశ‌యానికి మ‌ళ్లించే నీటిని ముందుగా సాగునీటి అవ‌స‌రాల‌కు మాత్ర‌మే వినియోగించాల‌ని సీఎం జ‌గ‌న్ ప్ర‌తిపాదించిన‌ట్టు తెలుస్తోంది. జ‌లాశ‌యం పూర్తిగా నిండిన త‌రువాతే విద్యుత్ ఉత్ప‌త్తికి నీటిని వాడాల‌ని ప్ర‌తిపాదించారని తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారులు నివేదిక‌లు త‌యారు చేసే ప‌నిలోప‌డ్డారు.
అయితే, తెలుగు రాష్ట్రాల్లో ఇంత కీల‌క‌మైన ప‌రిణామాలు చోటు చేసుకుంటూ ఉంటే… రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌తిప‌క్షాలు పెద్ద‌గా స్పందించ‌డం లేదు. ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల భేటీపై మాట్లాడేందుకు విప‌క్షాలు ప్రెస్ మీట్లు కూడా పెట్ట‌లేదు. జ‌గ‌న్, కేసీఆర్ భేటీలు తెలుగు రాష్ట్రాల భ‌విష్య‌త్తును క‌చ్చితంగా ప్ర‌భావితం చేస్తాయి. కాబ‌ట్టి, ఈ సంద‌ర్భంలో ఏవైనా సూచ‌న‌లూ స‌ల‌హాలూ ఉంటే విప‌క్షాలు చెయ్యొచ్చు, చెయ్యాల్సిన బాధ్య‌త కూడా ఉంటుంది క‌దా.  కేవ‌లం విమ‌ర్శించాల్సిన ప‌నే లేదు. గోదావ‌రి జ‌లాల‌ను అద‌నంగా శ్రీ‌శైలానికి త‌ర‌లిస్తే, పొరుగు రాష్ట్రాలైన క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్రల‌కు అద‌నంగా కొన్ని నీళ్లు ఇవ్వాల‌నే నిబంధ‌న ఉంది. దానిపై మాట్లాడొచ్చు. కేంద్రంలోని భాజ‌పా స‌ర్కారు కావేరీ-గోదావ‌రి న‌దుల అనుసంధానం కోసం గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలోనే కొన్ని ప్ర‌తిపాద‌న‌లు చేసింది. ఈ సంద‌ర్భంగా కృష్ణ‌, గోదారి నీళ్ల‌పై తెలుగు రాష్ట్రాలు తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై కేంద్రం ప్ర‌భావం ఉంటుందా లేదా అనేది చ‌ర్చించొచ్చు. సాంకేతికంగా ఇలాంటి అంశాలు కొన్ని ఉన్నాయి.
అయితే, తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌స్తుతం అంత‌ర్గ‌త సంక్షోభంలో ఉంది. పార్టీ నుంచి నేత‌ల వ‌ల‌స‌లు ఒక ప‌క్క, రాహుల్ గాంధీ సంక్షోభం మ‌రోప‌క్క‌. కాబ‌ట్టి, రాష్ట్ర వ్య‌వ‌హారాలు ప‌ట్టించుకునే ప‌రిస్థితిలో ఆ పార్టీ నేత‌లు లేరు. తెలంగాణ‌లో భాజ‌పా… ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పేరుతో బిజీబిజీగా ఉంది. కాబ‌ట్టి, వారికీ ముఖ్య‌మంత్రుల వ్య‌వ‌హారం అక్క‌ర్లేనిదైపోయింది. ఆంధ్రాలో చూస్తే… టీడీపీ ఇంకా ఎన్నిక‌ల్లో ఓట‌మి విశ్లేష‌ణ‌తో‌నే మునిగి తేలుతోంది. మ‌రోప‌క్క‌, కీల‌క నేత‌ల వ‌ల‌స‌లు కూడా ఉన్నాయి. ఆంధ్రాలో భాజ‌పాని ప్ర‌తిప‌క్ష పార్టీ అన‌లేంగానీ, వారు కూడా టీడీపీ నుంచి నేత‌ల్ని ఆక‌ర్షించే ప‌నిలో బిజీబిజీగా ఉన్నారు. ఏతావాతా రెండు రాష్ట్రాల్లో విప‌క్షాలన్నీ సొంత ప‌నుల‌తో బిజీబిజీగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు సంబంధించిన కీల‌క‌మైన అంశాల‌పై ముఖ్య‌మంత్రులు చ‌ర్చించుకుంటూ ఉంటే, స్పందించే టైం వాళ్ల‌కి లేకుండా పోతోంది!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప‌తంజ‌లిని మ‌ళ్లీ నిల‌దీసిన సుప్రీం… ఈసారి ఇంకా ఘాటుగా!

ప‌తంజ‌లి క్ష‌మాప‌ణ‌ల‌కు స‌సేమిరా అంటున్న సుప్రీంకోర్టు... ప‌తంజ‌లి ప్ర‌మోట‌ర్ల‌పై మ‌రోసారి మండిప‌డింది. కావాల‌నే తెలివిగా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా ప్ర‌క‌ట‌న‌లు ఇస్తూ త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై సాగుతున్న విచార‌ణ‌లో భాగంగా...

సూర‌త్ ఎన్నిక వెనుక జ‌రిగింది ఇదేనా?- బీజేపీలోకి కాంగ్రెస్ అభ్య‌ర్థి

క‌మ‌ల వికాసం మొద‌లైపోయింది. సూర‌త్ లో బీజేపీ అభ్య‌ర్థి గెలుపుతో మొద‌లైన ఈ హ‌వా 400సీట్ల‌కు చేర‌కుంటుంద‌ని బీజేపీ సంబురాలు చేసుకుంటుంది. అనైతిక విజ‌యం అంటూ కాంగ్రెస్ విరుచుక‌ప‌డుతుంటే, నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణకు గురైన...

భయమే బంగారమాయెనా…

హారర్ సినిమా అనగానే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. స్టార్ హీరోలు ఈ కథలని వినడానికి పెద్ద ఆసక్తి చూపించారు. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి హారర్ సినిమాలంటే క్రేజ్. నిజానికి...

భయమా..? అభద్రతాభావమా..?

కొద్ది రోజుల కిందట వరకు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికలకు సమయం సమీపించే కొద్దీ ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం అవుతూ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close