హమ్మ.. బండి సంజయ్‌నే లైట్ తీసుకుంటారా..!?

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు కోపం వచ్చింది. ఇతర పార్టీల మీద… ఇతర పార్టీల నేతల మీద కోపం రావడం సహజమే… కానీ.. ఆయనకు కోపం వచ్చింది మాత్రం సొంత పార్టీ నేతల మీద. అలా ఇలా కాదు.. చర్యలు తీసుకుంటానని ఊగిపోతున్నారు. ఎందుకంటే.. తనకు చెప్పకుండా బీజేపీ నేతలు వెళ్లి కేటీఆర్‌ను కలిశారట. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కేటీఆర్‌ను కలవడం ఏమిటనేది ఆయనప్రధాన అభ్యంతరం. అలా కలిసింది గ్రేటర్ బీజేపీ నేతలు. అదీ కూడా బీజేపీకి మేలు చేయమని కోరేందుకే వెళ్లారు. అయితే ఇది బండి సంజయ్‌కు ఏ మాత్రం నచ్చడం లేదు.

గ్రేటర్‌లో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థి గెలిచారు. అయితే ఆయన ప్రమాణస్వీకారం చేయక ముందే చనిపోయారు. దాతో ఉపఎన్నిక అనివార్యం అయింది. గెలిచిన బీజేపీ కార్పొరేటర్ కుటుంసభ్యుడ్ని ఏకగ్రీవంగా గెలిపించాలని ఆ నియోజకవర్గం బీజేపీ నేతలంతా అపాయింట్‌మెంట్ తీసుకుని కేటీఆర్‌ను కలిశారు . కేటీఆర్ కూడా సానుకూలంగా స్పందించి లింగోజీ గూడ నుంచి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో బీజేపీ నేతల పని ఫలవంతమైంది. కానీ బండి సంజయ్‌కు ఇది నచ్చలేదు. అది బీజేపీ సిట్టింగ్ సీటు అని.. భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉన్న చోట.. ఏకగ్రీవం కోసం టీఆర్ఎస్ వద్దకు వెళ్లడం ఎందుకుని..పైగా తన అనుమతి తీసుకోకకపోవడం ఏమిటని ఆయన ఫైరవుతున్నారు.

లింగోజిగూడ నుంచి టీఆర్ఎస్ పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది. అయినప్పటికీ అక్కడ ఏకగ్రీవం అయ్యే పరిస్థితి లేదు. కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి అనుచరుడు నామినేషన్ వేస్తున్నారు. మరికొంత మంది కూడా బరిలోకి దిగుతున్నారు. ఈ పరిస్థితి చూసి.. టీఆర్ఎస్ నేతలు కూడా.. కేటీఆర్‌పై ఒత్తిడి పెంచే అవకాశం కనిపిస్తోంది. ఏకగ్రీవం అయ్యే చాన్స్ లేదు కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నామని ప్రకటించి… అభ్యర్థిని దింపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close