స్నేహం ఏమైంది..? పోతిరెడ్డిపాడుపై తెలంగాణ ఫిర్యాదు..!

రాయలసీమను రతనాల సీమ చేస్తానని… స్వయంగా కేసీఆర్… రోజా ఇంట్లో ఆతిధ్యం స్వీకరించి వ్యాఖ్యానించి.. ఇంకా వారం రోజులు కూడా గడవలేదు. కానీ.., ఎగువ నుంచి వెల్లువలా వస్తున్న వరదను… పోతిరెడ్డిపాడు ద్వారా.. రాయలసీమకు తీసుకువెళ్తూంటే మాత్రం… అభ్యంతరం చెబుతున్నారు. ఈ మేరకు తెలంగాణ సర్కార్ కృష్ణా రివర్ బోర్డుకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ నుంచి అధికంగా నీటిని తరలిస్తున్నారని.. అడ్డుకోవాలని కోరింది. అలా తరలిస్తున్న నీరు లెక్కల్లోనూ ఏపీ అధికారులు.. తప్పుడు గణాంకాలు నమోదు చేస్తున్నారని తెలంగాణ సర్కార్ ఆరోపిస్తోంది. ఏపీ సర్కార్ ఇప్పటికి పది టీఎంసీలకుపైగా నీటిని తరలించినా.. రికార్డుల్లో మాత్రం.. ఏడు టీఎంసీలే చూపిస్తున్నారని తెలంగాణ వాదిస్తోంది.

నిజానికి శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం 840 అడుగులకు చేరగానే.. పోతిరెడ్డి పాడు ద్వారా.. రాయలసీమకు నీటిని తరలించే అవకాశం ఉంది. ముచ్చుమర్రి ఇతర ప్రాజెక్టుల ద్వారా.. సీమలో వర్షాలు లేకపోయినా.. గత సర్కార్ నీటి కొరత లేకుండా చూసుకుంది. అయితే.. ఈ సారి … 870 అడుగుల వరకూ.. శ్రీశైలం ప్రాజెక్ట్ లో నీటి నిల్వ వచ్చే వరకూ.. ఏపీ సర్కార్ .. పోతిరెడ్డిపాడును ఆన్ చేయలేదు. ఆ తర్వాత ప్రాజెక్ట్ నుంచి కిందకు నీళ్లు వదలక తప్పని పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రమే… పోతిరెడ్డి పాడు ఆన్ చేశారు. నాలుగైదు రోజులు ఆలస్యం కావడంతో… ఆ మేరకు.. రైతులకు నీళ్లు ఆలస్యం కానున్నాయి. అదే సమయంలో.. వరద పట్టనంతగా వస్తోంది. పోతిరెడ్డిపాడు నుంచి ఎంత ఎక్కువ తరలించినా… తెలంగాణకు నష్టం ఏమీ ఉండదు. అయినా… ఏపీ పై.. తెలంగాణ ఫిర్యాదు చేసి… కలకలం రేపుతోంది.

మిగులు జలాలపై .. సంపూర్ణ హక్కులు దిగువ రాష్ట్రాలకే ఉంటాయి. అయితే.. ఈ విషయంలో.. వరద తగ్గిపోయిన తర్వాత ప్రాజెక్టుల్లో ఉన్న నీటి వాటా అత్యధికంగా పొందడానికి… తెలంగాణ సర్కార్ ఈ తరహా ఫిర్యాదులు చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని.. తర్వాత కృష్ణా రివర్ బోర్డు పంపిణీ చేస్తుంది. ఆ సమయంలో.. పోతిరెడ్డి పాడు నుంచి… పెద్ద ఎత్తున నీటిని తరలించారు కాబట్టి… ఆ మేరకు.. తమకు ప్రాజెక్టుల్లో నీటిని కేటాయించాలని తెలంగాణ సర్కార్ కోరుతుంది. కానీ.. ఇప్పుడు.. పోతిరెడ్డి పాడు నుంచి తరలిస్తున్న మిగులు జలాలే…!. తెలంగాణతో స్నేహపూర్వకంగా ఉంటున్నామని చెప్పుకుంటున్న.. ఏపీ సర్కార్.. ఇలాంటి సున్నితమైన విషయాల్లో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి ఏం చేస్తుందో చూడాలి.. !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close