తెలంగాణలో టీడీపీని ఫినిష్ చేస్తున్న గరికపాటి..!

తెలంగాణలో టీడీపీని లేకుండా చేయాలని… ఒకప్పటి.. టీడీపీ సీనియర్ నేత.. ప్రస్తుత టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆపరేషన్ ప్రారంభించారు. దాన్ని ఇప్పుడు.. టీడీపీ తరపునే రాజ్యసభకు ఎంపికయి.. బీజేపీలో విలీనం అయిన గరికపాటి మోహన్ రావు.. పూర్తి చేస్తున్నారు. తెలంగాణలో మిగిలిపోయిన టీడీపీ నేతంలదర్నీ ఆయన బీజేపీ గూటికి చేర్చుతున్నారు. వివిధ జిల్లాల తెలుగుదేశం కార్యవర్గాలు పసుపు రంగు నుంచి కాషాయ రంగుకు మారబోతున్నాయి. ఆదివారం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా హైద్రాబాద్ వస్తున్నారు. టీడీపీ నాయకుల మూకుమ్మడి చేరికలతో పాటు.. బహిరంగ సభను కూడా బీజేపీ ఏర్పాటు చేస్తోంది.

తెలంగాణలోని ప్రతి జిల్లా నుంచి తెలుగుదేశం కార్యకర్తలు ఈ సభ ద్వారా బీజేపీలోకి రాబోతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఎక్కువ చేరికలున్నాయి. నల్లగొండ నుంచి తెలుగు మహిళా అధ్యక్షురాలు బండ్రు శోభరాణి, పాల్వాయి రజనీ, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాసరావు, అంజయ్య యాదవ్ లాంటి నేతలు చేరనున్నారు. వరంగల్ జిల్లా నుంచి ఈగ మల్లేశం, బొట్ల శ్రీనివాస్, అశోక్, మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎర్ర శేఖర్, జయశ్రీలు , రంగారెడ్డి నుంచి సామ రంగారెడ్డి, మొవ్వ సత్యనారాయణలు, ఖమ్మం జిల్లా నుంచి కోనేరు చిన్ని, మెదక్ జిల్లా నుంచి శ్రీకాంత్ గౌడ్ , మాజీ ఎమ్మెల్యే విజయ్ పాల్ రెడ్డిలు బీజేపీలో చేరబోతున్నారు. మహాబూబ్ నగర్ కు చెందిన సీనియర్ నాయకులు కొత్తకోట దయాకర్ రెడ్డి, సీత దయాకర్ రెడ్డిలు బీజేపీలో చేరాలని భావిస్తున్నా.. డీకే అరుణ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దాంతో చేరికలు ఆదివారం ఉండకపోవచ్చంటున్నారు.

మూకుమ్మడి చేరికలకు రాజ్యసభ ఎంపీ గరికపాటి అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. జిల్లాల నాయకులతో సమన్వయం చేసుకోవటం దగ్గర నుంచి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జేపీ నడ్డా సభకు ఖర్చును కూడా గరికపాటే భరిస్తున్నారు. నాలుగు రోజులుగా ఆయన ఎగ్జిబిషన్ గ్రౌంట్స్ లో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జేపీ నడ్డా సభను విజయవంతం చేసి బీజేపీ నాయకత్వం దృష్టిలో పడాలని గరికపాటి భావిస్తున్నారు. తెలంగాణలో టీడీపీని ఫినిష్ చేసి తన బలం నిరూపించుకోవాలని ఆయన అనుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

షర్మిల రాజకీయానికి జగన్ బెదురుతున్నారా..?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై జగన్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మరుసటి రోజే షర్మిలకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు....

నిస్సహాయుడిగా కేసీఆర్..!?

బీఆర్ఎస్ నేతలపై కేసీఆర్ పట్టు కోల్పోతున్నారా..? క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే ఆ పార్టీలో క్రమశిక్షణ లోపిస్తుందా..? నేతలు హద్దులు దాటుతున్న చర్యలు తీసుకోని నిస్సహాయ స్థితికి కేసీఆర్ చేరుకున్నారా..? అంటే అవుననే...
video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close