పోతిరెడ్డిపాడుపై ఏపీ జీవోను పట్టుకుని ఈదుతున్న టీ కాంగ్రెస్..!

తెలంగాణ ఏర్పడి ఆరేళ్లయిన సందర్భంగా..తెలంగాణ కాంగ్రెస్ ఏం చేయాలా అని ఆలోచించి… పోతిరెడ్డిపాడుపై ఏపీ సర్కార్ ఇచ్చిన జీవోనే పట్టుకుని రాజకీయంగా ఈదాలని నిర్ణయించుకుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కృష్ణాపై పెండింగ్ ప్రాజెక్టుల వద్ద జల దీక్షల ప్రోగ్రాం పెట్టుకున్నారు కాంగ్రెస్ నేతలు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు కోసం జగన్ జీవో ఇచ్చినా కేసీఆర్ మాట్లాడటం లేదని.. దక్షిణ తెలంగాణను ఎడారి చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో ఎస్‌ఎల్బీసీ వద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి , ఖమ్మం పాలేరు జలాశయం వద్ద భట్టి, సీతక్క, పొడెం వీరయ్య , వికారాబాద్ జిల్లా లక్ష్మీదేవిపల్లి పంపు హౌస్ వద్ద రేవంత్ రెడ్డి, కొండ విశ్వేశ్వర్ రెడ్డి.. ఇతర ప్రాంతాల్లో ఇతర నేతలు దీక్షలకు కూర్చుంటున్నారు.

ప్రాజెక్టులు.. నీటి విషయంలో తెలంగాణ సర్కార్‌కు.. ప్రజల్లో మంచి పేరే వచ్చింది. రైతుల్లో… సానుకూలత కనిపిస్తోంది. అయితే.. పొరుగు రాష్ట్రం ఇచ్చిన ఓ జీవోను పట్టుకుని… ఆ సానుకూలతను వ్యతిరేకతగా మార్చాలనే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు చేయడం… సొంత పార్టీలోనే కొంత మందికి నచ్చడం లేదు. ఏపీ సర్కార్ కేవలం జీవోనే ఇచ్చిందని… ఎన్జీటీ సహా.. అపెక్స్‌ కౌన్సిల్ సహా..అన్నీ ఆపేయమని.. చెప్పాయని ఇప్పుడు దాన్ని వివాదాస్పదం చేయడం ఎందుకని అంటున్నారు. అలా చేయడం వల్ల సెంటిమెంట్ పెరుగుతుందని.. దాని వల్ల టీఆర్‌ఎస్‌కే లాభమని గుర్తు చేస్తున్నారు.

అయితే.. కాంగ్రెస్ మాత్రం.. పోతిరెడ్డిపాడుపై ఏపీ జీవోను పట్టుకునే రాజకీయం చేయాలని నిర్ణయించేసుకుంది. కాంగ్రెస్‌లో నేతల మధ్య సఖ్యత లేదు. ఇప్పటికే.. పీసీసీ చీఫ్ పీఠం విషయంలో రేవంత్ రెడ్డి అండ్ అదర్స్ అన్నట్లుగా విడిపోయారు. సమైక్యంగా ఈ ప్రాజెక్టు దీక్షల్ని అయినా చేస్తారో.. లేక ఎవరికి వారో అన్నట్లుగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది. కాంగ్రెస్ నేతల్లో ఉన్న అనైక్యతను టీఆర్ఎస్ నేతలు బాగానే ఉపయోగించుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కోమ‌టిరెడ్డిలో మ‌రో కోణం… కొడుకు పేరుతో సేవ!

నిత్యం ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు... వేలాది మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. హ‌డావిడి. వైఎస్ హాయం నుండి వేగంగా ఎదిగిన మంత్రి కోమటిరెడ్డి, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ నేనున్నా అని అండ‌గా ఉంటారు. ముఖ్యంగా కోమ‌టిరెడ్డి కుమార్...

పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వెంకటేష్ నేత..?

తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలపై కన్నేసిన బీజేపీ ప్రచారంలో వెనకబడిన అభ్యర్థులను మార్చాలని నిర్ణయం తీసుకోనుందా..? సర్వేలతో ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకుంటున్న జాతీయ నాయకత్వం పెద్దపల్లి లోక్ సభ అభ్యర్థిని మార్చనుందా..?...

మూడు రోజులు బయటకు రాకండి… వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!

తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. రానున్న మరో మూడు రోజులపాటు 3 నుంచి 5 డిగ్రీల సెంటిగ్రేడ్ ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ...

నా కొడుకును ఉరి తీయండి… మాజీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ‌లోనే సంచ‌ల‌నం సృష్టిస్తున్న బీఆర్ఎస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ కొడుకు హిట్ అండ్ ర‌న్ కేసుల‌పై ష‌కీల్ స్పందించారు. ఓ కేసులో బెయిల్ రాగానే మ‌రో కేసు తెర‌పైకి తీసుక‌రావ‌టం వెనుక...

HOT NEWS

css.php
[X] Close
[X] Close