ఒక్క రోజే 75 పాజిటివ్ కేసులు.. తెలంగాణ కౌంట్ 229..!

తెలంగాణలో ఒక్క రోజే 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసులు 229కి చేరాయి. అదే సమయంలో.. మరో ఇద్దరు చనిపోయారు. దీంతో కరోనా కారణంగా తెలంగాణలో చనిపోయిన వారి సంఖ్య పదకొండుకు చేరింది. అయితే.. వైద్యుల కృషితో పదిహేను మందికి నెగెటివ్ వచ్చింది. వారందర్నీ డిశ్చార్జ్ చేశారు. అంటే ప్రస్తుతం తెలంగాణ ఆస్పత్రుల్లో 186 మంది కరోనా పాజిటివ్‌కు చికిత్స పొందుతున్నారు. కొత్తగా వెలుగు చూసినా కరోనా పాజిటివ్ కేసులన్నీ ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇలా వెళ్లి వచ్చిన వారందర్నీ ప్రభుత్వం గుర్తించిందని.. వారందర్నీ క్వారంటైన్ కు తరలించామని అధికారవర్గాలు చెబుతున్నాయి. చనిపోయిన ఇద్దరు కూడా… మర్కజ్ సమావేశాలకు వెళ్లిన వారేనని తెలుస్తోంది. వారితో కాంటాక్ట్‌లో ఉన్న వారిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు.

తెలంగాణలో ఇప్పటి వరకూ 32 మంది కరోనా పాజిటివ్ వ్యక్తులకు చికిత్స ద్వారా నెగెటివ్ వచ్చింది. ఇది కూడా ఓ రికార్డే. ఇంకా పెద్ద ఎత్తున కరోనా అనుమానితులు, మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన వారి శాంపిళ్లు ల్యాబుల్లో ఉన్నాయి. వాటిని పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం.. ఢిల్లీ మర్కజ్ కు వెళ్లిన వారికి సగటున… ప్రతి ముగ్గురిలో ఒకరికి కరోనా వైరస్ బయటపడుతోంది కాబట్టి.. ఈ సంఖ్య ఇంకా ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో.. వీరి కాంటాక్ట్ కేసులు కూడా.. అంతకు మించి పెరుగుతున్నాయి. మర్కజ్ ప్రార్థనల విషయం బయటకు రాక ముందు కేసీఆర్.. ఏప్రిల్ ఏడో తేదీ కల్లా… కరోనా ఫ్రీ స్టేట్‌గా తెలంగాణను చూడాలని అనుకున్నారు.

అయితే.. అలా ప్రకటన చేసిన రోజే… ఇలా ఢిల్లీ నుంచి వచ్చిన వారు ఆరుగురు చనిపోయారు. దీంతో.. ఒక్క సారిగా గందరగోళం ప్రారంభమయింది. ఢిల్లీ మర్కజ్ సమావేశాలకు వెళ్లి వచ్చిన వారందరికీ టెస్టులు చేస్తున్నారు. వారితో కాంటాక్టులో ఉన్న వారికీ టెస్టులు చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. తమిళనాడులో వందకుపైగా పాజిటివ్ కేసులు మర్కజ్ కు వెళ్లి వచ్చిన ద్వారానే ఒక్క రోజులో వెలుగు చూశాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close