ఎన్నికల మూడ్‌లో తెలంగాణ !

జూన్ వచ్చేస్తోంది. మరో ఐదు నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిపోతుంది. దీంతో రాజకీయ పార్టీలన్నీ పూర్తి స్థాయిలో ఎన్నికల మూడ్ లోకి వచ్చేశాయి. కేసీఆర్ అభ్యర్థుల్ని ఖరారు చేసేసి.. తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇతర పార్టీలు కూడా అదే దశగా ఉన్నాయి. షర్మిల కూడా .. ఏదో ఓ పార్టీతో జత కట్టాలని చూస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఫీల్డ్ లోకి దిగే ముందు.. ఇతర పనులను చక్కబెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

కేసీఆర్ .. బీఆర్ఎస్ మళ్లీ వస్తుందన్న భావన కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన లెక్క వందకు తగ్గట్లేదు. అలాగని నిర్లక్ష్యం చేయడం లేదు. పూర్తి స్థాయిలో తెలంగాణపైనే దృష్టి పెట్టారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక రేసులోకి వచ్చింది. ఆయనకు ధీటైన నేతలం అని చెప్పుకునేందుకు ఇతర సీనియర్లు పాదయాత్రలు..ఇతర పనులు చేపట్టడం ఆ పార్టీకి ప్లస్ అనుకోవాలి. కర్ణాటకలో గెలవడం అడ్వాంటేజ్ అయింది.

బీజేపీ చేరికలు లేకపోవడంతో డీలాపడింది. చేరిన నేతలు కూడా వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. మళ్లీ బౌన్స్ బ్యాక్ అవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ కాకపోవడంతో .. ఆ ప్రభావం పార్టీపై ఉందని.. బీజేపీ నేతలు..హైకమాండ్ పై ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటాయో లేదో స్పష్టత లేదు. అదో ఓ చర్య తీసుకోకపోతే.. బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనన్న భావన ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. అది కాంగ్రెస్ పార్టీకి్ మేలు చేస్తుంది.

అంతిమంగా ఎన్నికలకు అవసరమైన బ్యాక్ గ్రౌండ్ వర్క్ ను రాజకీయ పార్టీలు రెడీ చేసుకున్నాయి. మరో నెల తర్వాత అందరూ ప్రచార బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మ‌రో జాతిర‌త్నాలు అవుతుందా?

ఈమ‌ధ్యకాలంలో చిన్న సినిమాలు మ్యాజిక్ చేస్తున్నాయి. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా వ‌చ్చి, వ‌సూళ్లు కొల్ల‌గొట్టి వెళ్తున్నాయి. `మ్యాడ్‌` టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, పాట‌లూ చూస్తుంటే.. ఇందులోనూ ఏదో విష‌యం ఉంద‌న్న భ‌రోసా క‌లుగుతోంది. సంగీత్‌...

చైతన్య : నిజమే మాస్టారూ – వై ఏపీ నీడ్స్ బటన్ రెడ్డి ?

వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని జగన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఆంధ్రాకు ఆయన అవసరం ఏంటి అనే చర్చ ప్రజల్లో పెట్టబోతున్నారు. ఇది నెగెటివ్ టోన్ లో ఉంది. అయినా...

ఈ సారి కూడా మోదీకి కేసీఆర్ స్వాగతం చెప్పలేరు !

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఐదుగురు వైద్యుల బృందంతో చికిత్స అందిస్తున్నట్లుగా మంత్రి కేటీఆర్ తెలిపారు. వారం రోజులుగా జ్వరం, దగ్గుతో కేసీఆర్ బాధపడుతున్నారు. ఒకటి, రెండు రోజులకు తగ్గిపోయే...

టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ అని మర్చిపోతున్న కేటీఆర్ !

కేటీఆర్ ఇంకా తెలంగాణ రాష్ట్ర సమితిలోనే ఉన్నారు. భారత రాష్ట్ర సమితి వరకూ వెళ్లలేదు. అందరితో పాటు తాను కూడా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటికీ... అలా అనుకోవడం లేదు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close