కరోనా టెస్టుల లెక్కలు తేల్చాల్సిందేనన్న తెలంగాణ హైకోర్టు ..!

కరోనా వైరస్ టెస్టులు పెద్దగా చేయకపోవడం.. తెలంగాణ సర్కార్ ను ఇబ్బందుల్లోకి నెడుతోంది. టెస్టుల విషయంలో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. కొద్ది రోజుల కిందట..కరోనా లక్షణాలతో చనిపోయిన వారికి టెస్టులు అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని కోర్టు కొట్టి వేసింది. హైరిస్క్ అవకాశాలున్న వారికి పరీక్షలు ఎందుకు చేయడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ టెస్టులు చేస్తున్నారని… మార్చి 11 నుంచి ఇప్పటి వరకు చేసిన టెస్ట్‌ల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. కరోనా పరీక్షలపై కేంద్రం రెండు సార్లు రాసిన లేఖలు సమర్పించాలని కూడా ఆదేశించింది.

పీపీఈ కిట్లు ఎన్ని ఆస్పత్రుల్లో, ఎంత మందికి ఇచ్చారో .. జూన్‌ 4లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. తెలంగాణలో కరోనా పరీక్షలను హఠాత్తుగా తగ్గించేశారని పిటిషన్లు వేశారు. గతంలో ఇదే అంశంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తరవాత టెస్టుల సంఖ్యను పెంచారు. అంతకు ముందు రోజూ.. మూడు నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యేవి. ఆ తర్వాత నుంచి 40, 50 కేసులు నమోదవుతున్నాయి. అయినప్పటికీ.. ఇతర రాష్ట్రాలు చేస్తున్న స్థాయిలో టెస్టులు లేవని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా… తెలంగాణలో టెస్టుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ లేఖలు రాసింది.

ఆ లేఖలు హైలెట్ అయ్యాయి. కేంద్రం రాసిన లేఖలపై… తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఫైరయ్యారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారమే.. టెస్టులు చేస్తున్నామని… వాదించారు. ఈ పరిణామాలన్నింటి మధ్య… హైకోర్టు తాజాగా.. టెస్టుల వివరాలు ఇవ్వాలని ఆదేశించడం.. ఆసక్తికరంగా మారింది. కేసుల సంఖ్యను తక్కువగా చూపడానికి తెలంగాణ సర్కార్… టెస్టులే నిలిపివేసిందని.. విపక్షాలు ఇప్పటికే ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం చిక్కుల్లో పడినట్లయింది

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close