తల్లికి వందనం పథకం అమలు విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం వ్యూహాత్మకంగా వేసిన అడుగులు ప్రజల్లో పాజిటివ్ ప్రచారానికి దారి తీశాయి. ఇదిగో.. అదిగో అని ఎక్కువగా ఆశపెట్టలేదు. పెద్దగా ప్రకటనలు ఇవ్వలేదు. కేవలం తమ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిందన్న ప్రచారం చేసుకున్నారు. ఆ ప్రచారంలో భాగంగానే తల్లికి వందనం అమలు చేసేశారు. బటన్లు నొక్కే పని లేకుండా డబ్బులు ఖాతాల్లో పడిపోయాయి.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజే దాదాపుగా పది వేల కోట్ల రూపాయలను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో, పాఠశాలల ఖాతాల్లోకి జమ చేశారు. ఇంత పెద్ద మొత్తంలో ఏ ప్రభుత్వమూ నగదు బదిలీ పథకాన్ని అమలు చేయలేదు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు డబ్బులు ఇస్తామని చెప్పింది.. ఆ మేరకు స్కీమ్ అమలు చేసింది. ఒక్కో ఇంట్లో ఐదుగురు ఉన్నా డబ్బులు జమ అయ్యాయి. ఇలాంటి వారి ఆనందానికి అవధుల్లేవు. పార్టీ చూడలేదు.. కులం చూడలేదు.. మతం చూడలేదు. అందరికీ డబ్బులు జమ అయ్యాయి.
జగన్ రెడ్డి హయాంలో అమ్మఒడి పేరుతో చేసుకున్న ప్రచారానికి.. అమలు చేసిన విధానానికి చాలా తేడా ఉంది. ప్రజల్లో అసంతృప్తి ఉంది. లబ్దిదారులు 40 శాతం ఉంటే.. అసంతృప్తికి గురయినా వారు అరవై శాతానికిపైగా ఉన్నారు. కానీ ఇప్పుడు సాంకేతిక కారణాలు.. ఇతర సమస్యల వల్ల ఇరవై శాతం మంత్రి మాత్రమే.. తమకు రాలేదని చెబుతున్నారు. ఎనభై శాతం విద్యార్తుల తల్లులు సంతోషంగా ఉన్నారు. ఆ ఇరవై శాతం మంది సమస్యల్ని పరిష్కరించడానికి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది.
జగన్ రెడ్డి బటన్లు మోసం అని ప్రజలు ఎన్నికల సమయానికి తెలుసుకున్నారు. పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చి తన సొంత పత్రిక ఖజానా నింపడానికి పథకాలను వాడుకున్నారు కానీ.. ప్రజల ఖాతాల్లో మాత్రం డబ్బులు జమ చేయలేదు. ఇప్పుడు బటన్లు నొక్కకుండానే పథకాలు అమలు కావడం అందర్నీ సంతృప్తి పరుస్తోంది. లబ్దిదారులు చేసే ప్రచారాన్ని మించిన పాజిటివ్ ఏ ప్రభుత్వానికైనా ఏముంటుంది ?