తేలిన పొత్తులు – నేడు సీట్లు ఫైనల్ !

ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తులు కుదరకూడదని చాలా ప్రయత్నాలు చేసిన వైసీపీకి షాక్ తగిలింది. చివరికి పొత్తులు ఖరారు అయ్యాయి. సీట్ల సంఖ్యపై ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏడు పార్లమెంట్, పది అసెంబ్లీ స్థానాలను బీజేపీ ప్రాథమికంగా కోరింది. అయితే ఇప్పటి వరకూ తాము చేసిన కసరత్తును బట్టి నాలుగు పార్లమెంట్, ఆరు అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు సిద్ధమని చంద్రబాబు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై ఈ రోజు.. రేపట్లో తేలిపోతుంది. అధికారికంగా ఎన్డీఏ చేరిక విషయాన్ని ప్రకటించినప్పుడు ఎన్ని సీట్లలో ఎక్కడెక్కడ పోటీ చేసేది కూడా ప్రకటించే అవకాశం ఉంది.

బీజేపీ .. టీడీపీ, జనసేన కూటమిలో చేరకుండా ఉండేందుకు వైసీపీ అధినేత జగన్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. గతంలో చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడు తాను కూడా హడావుడిగా ఢిల్లీ వెళ్లి.. పార్లమెంట్ లో ప్రధాని మోదీని కలిసి తాను సంపూర్ణ మద్దతుదారుగా ఉంటానని.. ఎన్డీఏలోకి టీడీపీని చేర్చుకోవద్దని కోరినట్లుగా ప్రచారం జరిగింది అవసరమైతే తాను ఎన్డీఏలో చేరేందుకు సిద్ధమని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే బీజేపీ మాత్రం పెద్దగా పట్టించుకోలేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.

వైసీపీ కోరికను నీలి మీడియా చాలా సార్లు బయట పెట్టింది. టీడీపీ షాక్.. బీజేపీ ఒంటరి పోరు అంటూ తరచూ బ్రేకింగ్‌లు వేసి తమ కోరికను .. ఫేక్ న్యూస్ ద్వారా అయినా తీర్చచుకునే ప్రయత్నాలు చేశారు. వారి ప్రయత్నాలు అన్నీ వమ్ము అయ్యాయి. బీజేపీకి ఇచ్చే సీట్లకు ప్రతిఫలంగా టీడీపీ కోరుకునేది.. నిష్పాక్షికమైన ఎన్నికల నిర్వహణ మాత్రమే. ఈ విషయంలో బీజేపీ మాట మీద ఉంటుందని టీడీపీ నేతలు నమ్ముతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close