టీఆర్ఎస్‌లో 12 నియోజకవర్గాల టెన్షన్..! టిక్కెట్లెవరికి..?

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పెండింగ్‌లో పెట్టిన 12 అసెంబ్లీ నియోజకవర్గాల వ్యవహారం ఆ పార్టీ ఆశావహుల్లో టెన్షన్ పుట్టిస్తోంది. అసెంబ్లీని రద్దు చేసిన రోజే 105 మంది అభ్యర్ధులను ప్రకటించిన కెసీఆర్ ఆ తర్వతా మరో రెండు సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించారు. 12 సీట్ల ను పెండింగ్ లోపెట్టారు. అభ్యర్థులంతా పాక్షిక మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కానీ పన్నెండు నియోజకవర్గాల్లో ఆశావాహులు మాత్రం… ఖర్చు పెట్టుకోవాలా వద్దా అన్న టెన్షన్‌లో ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లో కాస్త బలమైన నేతలే కావడంతో ఈ సీట్లను ఎవరికి ఇస్తే బాగుంటుందన్న దానిపై ఇప్పటికే ఫ్లాష్ సర్వేలు నిర్వహించారు. అభ్యర్థులపై ఓ నిర్ణయానికి వచ్చారు.

ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి దానం నాగేందర్, గత ఎన్నికల్లో పోటీచేసిన ఓడిన మన్నె గోవర్ధన్ రెడ్డి, పిజెఆర్ కుమార్తె, కార్పోరేటర్ విజయారెడ్డి టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో దానం నాగేందర్ సరైన అభ్యర్ధిగా కెసీఆర్ ఓ అంచనాకు వచ్చినట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇక మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి ఆయన కోడలు విజయశాంతికి టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నా…ఆ సీటును గ్రేటర్ పార్టీ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావుకు ఫైనల్ చేశారని చెబుతున్నారు. లేకపోతే.. ఆయన పార్టీ మారేందుకు కూడా సిద్ధపడుతున్నారు. గోషామహల్ నుంచి మూసి నది అభివృద్ధి కార్పోరేషన్ ఛైర్మెన్ ప్రేం సింగ్ రాథోడ్ కు లైన్ క్లియర్ అయింది. మేడ్చల్ నుంచి ఎంపీ మల్లారెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలంటున్నాయి.

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ తాజామాజీ ఎమ్మెల్యే బొడిగె శోభకు మొండిచేయి చూపారు. అక్కడి నుంచి సుంకే రవిశంకర్ కు ఓకే చెప్పేశారు. ఆయన ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఈ విషయం తెలిసి.. బొడిగే శోభ కేసీఆర్ పై విమర్శలు కూడా చేస్తున్నారు. వరంగల్ ఈస్ట్ లో మేయర్ నన్నపనేని నరేందర్ కే ఖరారయినట్లు … తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. హుజుర్ నగర్ నియోజకవర్గం నుంచి ఎవరిని నిలబెట్టాలనే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను బుజ్జగించి.. ఎలాగోలా.. ఎన్ఆర్ఐలు సైదిరెడ్డి, అప్పిరెడ్డిల్లో ఒకరికి ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నారు. ఆమెను తెలంగాణ భవన్‌కు పిలిపించి మాట్లాడారు. కోదాడలో కూటమి అభ్యర్థి ఖరారయిన తర్వాత అభ్యర్థిని ఖరారు చేయనున్నారు.

ఈ నెల 6 న పార్టీ పూర్తి స్థాయి మానిఫెస్టో ను కేసిఆర్ తెలంగాణ భవన్ లో ప్రకటించనున్నారు. అదే రోజున అభ్యర్థుల ప్రకటన చేయాలని అనుకున్నారు. అప్పటికి కూటమి అభ్యర్ధుల ప్రకటన ఉంటుందని.. అసంతృప్తులను తమవైపు తిప్పుకోవాలని ఎత్తుగడలు వేశారు. ఈ విషయం తెలిసిందేమో కానీ.. కాంగ్రెస్ ఎనిమిదో తేదీన జాబితా విడుదల చేస్తామని ప్రకటించింది. దాంతో.. ఆ తర్వాత టిక్కెట్లు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు టీఆర్ఎస్ అధినేత సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘లెజెండ్’ ఎఫెక్ట్.. జయం మనదే

బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ...

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close