ఆచార్య‌… టైటిల్ మార‌బోతోందా?

చిరంజీవి – కొర‌టాల శివ క‌ల‌యిక‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. ఈ చిత్రానికి ఆచార్య అనే టైటిల్ ఫిక్స‌య్యింది. చిత్ర‌బృందం ఈ టైటిల్‌ని అధికారికంగా ప్ర‌క‌టించ‌కున్నా – ఓ ప్రీరిలీజ్ ఫంక్ష‌న్లో చిరంజీవి నోరు జారి `ఆచార్య‌`అనే పేరు చెప్పేశారు. దాంతో ఈ సినిమా టైటిలేంటో జ‌నాల‌కు తెలిసిపోయింది. అయితే ఇప్పుడు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఈ సినిమా టైటిల్ మారే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. దానికి రెండు ప్ర‌ధాన కార‌ణాలున్నాయి.

ఈ చిత్రంలో చిరంజీవితో పాటు మ‌రో క‌థానాయ‌కుడు కూడా న‌టిస్తాడ‌ని (మ‌హేష్ బాబు కావొచ్చు) ప్ర‌చారం జ‌రుగుతోంది. అలాగైతే ఇది మ‌ల్టీస్టార‌ర్ చిత్రం అయిపోతుంది. మ‌రో హీరో అభిమానుల్నీ సంతృప్తిప‌ర‌చాలంటే ఇద్ద‌రు హీరోల పాత్ర‌ల‌కు సంబంధించిన పేరు టైటిల్‌లో క‌నిపించాలి. అప్పుడే ఈ చిత్రానికి అస‌లు సిస‌లైన మ‌ల్టీస్టార‌ర్ ముద్ర ప‌డుతుంది. ఇది వ‌ర‌కు ఈ చిత్రానికి గోవింద ఆచార్య అనే పేరు అనుకున్నారు. ఆ త‌ర‌హా పేరు ఖ‌రారు చేసే అవ‌కాశాలున్నాయి.

ఇక రెండో కార‌ణం.. ఈ సినిమా పేరుని ఎలాంటి హ‌డావుడీ లేకుండా ప్ర‌క‌టించేయ‌డం చిత్ర‌బృందానికి ఏమాత్రం న‌చ్చ‌లేదు. ఈ సినిమా పేరు ప్ర‌కటించ‌డంతోనే ప‌బ్లిసిటీ మొద‌లెట్టాల‌ని భావించారు. కానీ చిరు పొర‌పాటున నోరు జార‌డంతో టైటిల్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఇప్పుడు ఆ టైటిల్‌కి కాస్త అటూ ఇటూ మార్చి కొత్త టైటిల్ అన్న‌ట్టు విడుద‌ల చేస్తే బాగుంటుంద‌న్న‌ది మ‌రో ఆలోచ‌న‌. చిరంజీవి తో పాటు ఇందులో న‌టించే మ‌రో హీరో ఎవ‌రు అనేదాన్ని బ‌ట్టే టైటిల్ ఉండబోతోంది, చ‌ర‌ణ్‌, బ‌న్నీలాంటి కుటుంబ హీరోతోనే స‌ర్దుకుపోతే టైటిల్ మారే అవ‌కాశం లేదు. అలాకాకుండా మ‌హేష్ లాంటి హీరో వ‌స్తే మాత్రం ఈ టైటిల్‌ని పొడిగించే అవ‌కాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎలక్షన్ ట్రెండ్ సెట్ చేసేసిన ఏపీ ఉద్యోగులు !

ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్ బ్యాలెట్లు ఎవరూ ఎవరూ ఊహించని స్థాయిలో పెరిగాయి. గత ఎన్నికల కంటే రెట్టింపు అయ్యాయి. ఏపీలో మొత్తం దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు....

నేటితో ప్రచారానికి తెర…నేతల ప్రచార షెడ్యూల్ ఇలా

మరికొద్ది గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5గంటలలోపే ప్రచారం ముగించాల్సి ఉండటంతో ఆయా పార్టీల అధినేతలు,అభ్యర్థులు మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా షెడ్యూల్ రూపొందించుకున్నారు....

పిఠాపురానికి రామ్ చరణ్ – వైసీపీ అభ్యర్థి కోసం అల్లు అర్జున్

డూ ఆర్ డై అన్నట్లుగా జరుగుతున్న ఏపీ ఎన్నికల్లో చివరికి వచ్చే సరికి కొన్ని విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి మెగా ఫ్యామిలీ...

లోక్ సభ ఎన్నికలు…ఏ పార్టీ ఏ అంశాన్ని హైలెట్ చేసిందంటే..?

ఎంపీ ఎన్నికలను తెలంగాణలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.మెజార్టీ సీట్లే లక్ష్యంగా నెల రోజులుగా తీరిక లేకుండా ప్రచారాన్ని పరుగులు పెట్టించాయి. ప్రత్యర్ధి పార్టీలపై అనేక ఆరోపణలు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close