టాలీవుడ్ మ‌రో గొప్ప అడుగు…. క‌రోనా క్రైసెస్ చారిటీ

ఓ విష‌యంలో తెలుగు ప‌రిశ్ర‌మ‌ని మెచ్చుకొని తీరాలి. ఎలాంటి ప్ర‌కృతి వైప‌రీత్యం సంభవించినా, మేమున్నాం అంటూ ముందుకొస్తారు. త‌మ వంతు స‌హాయ స‌హ‌కారాలు అందిస్తారు. క‌రోనాపై పోరాటానికి ఇప్ప‌టికే భారీ ఎత్తున విరాళాలు ప్ర‌క‌టించింది టాలీవుడ్‌. ఇప్పుడు మ‌రో గొప్ప ముంద‌డుగు వేసింది. సీసీసీ (క‌రోనా క్రైసెస్ చారిటీ) అనే సంస్థ‌ని స్థాపించింది. దీని ద్వారా పేద సినీ క‌ళాకారుల్ని ఆదుకోబోతోంది. సినీ తార‌లు ప్ర‌క‌టించిన విరాళాల్ని ఈ సంస్థ ఓ చోట చేర్చి దాన్ని క్ర‌మ ప‌ద్ధ‌తిలో కొన్ని కార్య‌క్ర‌మాల ద్వారా సినీ కార్మికుల‌కు చేయూత నివ్వ‌డానికి ఖర్చు చేయ‌నుంది. ఈ సీసీసీకి చిరంజీవి అధ్య‌క్షులుగా వ్య‌వ‌హ‌రిస్తారు. త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజా, సి.క‌ల్యాణ్‌, ఎన్‌.శంక‌ర్‌, సురేష్ బాబు, దామూ కీల‌క స‌భ్యులుగా వ్య‌వ‌హ‌రిస్తారు. ఫెడ‌రేష‌న్‌కు సంబంధించిన అన్ని సేవా సంఘాలూ వీటిలో భాగ‌స్వామ్యం పంచుకుంటాయి. చిరంజీవి ప్ర‌క‌టించిన రూ.1 కోటి విత‌ర‌ణ కూడా సీసీసీ ద్వారానే ఖ‌ర్చు చేస్తారు. తాజాగా నాగార్జున రూ.1 కోటి ప్ర‌క‌టించారు. రామ్ చ‌ర‌ణ్ సీసీసీ కోసం రూ.30 ల‌క్ష‌లు ప్ర‌క‌టించారు. మ‌హేష్ బాబు కూడా అద‌నంగా మ‌రో 25 ల‌క్ష‌లు అంద‌జేయ‌నున్నారు.

నిజంగానే ఇదో మంచి అడుగు. చిత్ర‌సీమ అంటే.. హీరోలు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లే కాదు. అట్ట‌డుగున ప‌నిచేసే శ్రామికులు కూడా. లైట్ బోయ్స్ ద‌గ్గ‌ర్నుంచి కెమెరా అసిస్టెంట్స్ వ‌ర‌కూ..ఎంతోమంది చ‌మ‌టోడిస్తే గానీ సినిమా త‌యార‌వ్వ‌దు. అలాంటి కార్మికుల కాలే క‌డుపుల్ని నింపాల్సిన బాధ్య‌త ప‌రిశ్ర‌మ‌కు ఉంది. కాక‌పోతే.. అదెంత ప‌టిష్టంగా ప‌నిచేస్తుంద‌న్న‌ది చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close