చంద్రబాబు, పవన్ పై ఆ ఛానెల్ బ్యాన్..?

క్షణాల్లో బ్రేకింగ్ వార్తలు అందిస్తాం..ప్రజా సమస్యలను వెలికితీస్తాం.. అని చెప్పుకునే ఓ ప్రధాన స్రవంతి మీడియా వైఖరిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. కొన్ని రోజులుగా ఆ ఛానెల్ లో పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు సంబంధించిన సమావేశాలు ఏమీ ప్రసారం కావడం లేదు. కేవలం జగన్ కు సంబంధించిన మీటింగ్స్ కు మాత్రమే కవరేజ్ ఇస్తుండటం మీడియా, రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

అయితే, సదరు చానెల్ ఉద్యోగులకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీడియోలు వాడొద్దని పైనుంచి ఆదేశాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎన్నికలు పూర్తయ్యే వరకు వైసీపీ సమావేశాలు మాత్రమే ప్రసారం చేయాలని… చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీటింగ్స్ కు ఏమాత్రం కవరేజ్ ఇవ్వొద్దని ఆదేశాలు అందినట్లుగా సమాచారం. ఆ కారణంగానే ఆ ఛానెల్ లో పూర్తిగా కూటమి సమావేశాలపై అప్రకటిత నిషేధం కొనసాగుతుందన్న ప్రచారం జరుగుతోంది.

తెలుగు మీడియాలో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాం. క్షణాల్లో జరిగే వార్తలను మీకందిస్తున్నాని గొప్పగా చెప్పుకుంటోంది ఆ ఛానెల్. అయినప్పటికీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై దాడికి ప్రయత్నం జరిగితే ఆ అంశాన్ని ఎక్కడ కవర్ చేయకపోవడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ప్రజల కోసమే పని చేస్తాం అని చెప్పుకుంటూ..పెయిడ్ ఛానెల్ గా మారిందని నెటిజన్లు ఆ ఛానెల్ పై దుమ్మెత్తిపోస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close