విశాఖలో సముద్రం అలజడి.. నాసా నివేదికలు నిజమవుతాయా !?

విశాఖలో ఆదివారం ఆహ్లాదంగా బీచ్ ఒడ్డున గడపాలనుకున్న ప్రజలకు ఆందోళన కనిపించే దృశ్యాలు కనిపించాయి. సముద్రం ఒక్క సారిగా ముందుకు వచ్చింది. మరో చోట పూర్తిగా వెనక్కి వెళ్లింది. అలలు మూడు మీటర్ల ఎత్తున ఎగసి, సముద్రం తీరం వైపు చొచ్చుకొచ్చింది. అలల తాకిడికి బీచ్‌రోడ్డులోని చిల్డ్రన్‌పార్క్‌ ప్రహరీకూలిపోయింది. సుమారు 500 అడుగుల పొడవున 2-3 అడుగుల లోతున మట్టి జారిపోయింది. మరో చోట గతంలో కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ ఓడ ఉన్న చోట సముద్రం వెనక్కి పోయింది. దీంతో ఆ ఓడ రాళ్లపై ఉన్నట్లుగా నిలబడింది. ఇవన్నీ విశాఖ వాసులకు దడ పుట్టించారు.

అమావాస్య కారణంగా అలా అలలు వస్తాయి కానీ.. ఇప్పుడు మాత్రం తీవ్ర పెరిగింది. ప్రజలు ఆందోళన చెందడానికి మరోకారణం కూడా ఉంది. రాబోయే వందేళ్లలో దేశంలోని 12 తీర నగరాలు.. మునుగుతాయని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చెబుతోంది. ఇండియాలో విశాఖ, చెన్నై, ముంబై, కాండ్లలో సముద్రమట్టాలు 2 అడుగుల వరకూ పెరుగుతాయని.. ప్రతి ఏటా ౩ మిల్లీమీటర్లు పైకి వస్తుందని లెక్కలేసింది. 2100 నాటికి దేశంలోని 12 నగరాల‌్లో 2 అడుగుల పైన సముద్రం పెరుగుతుందని తెలిపింది. అలా జరిగితే ఇబ్బంది కర పరిస్థితులు ఎదురవుతాయి.

ఏ ప్రభుత్వం ఉన్నా ఇష్టారాజ్యంగా బీచ్‌లను ధ్వంసం చేయడం.. సీఆర్‌జెడ్ నిబంధనలు పాటించకుడా సొంత వ్యాపారాల కోసం ఎంతకైా తెగించడం.. ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతూండటంతో మొదటికే మోసం వస్తోంది. ఈ పరిస్థితిలో మార్పు రాకపోతే.. ప్రజలు ఇబ్బంది పడతారు. విశాఖ నగరం ఇబ్బంది పడుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close