కేసీఆర్ “ధరణి”పై దృష్టి పెట్టాల్సిందే !

“ధరణి”అనే వ్యవస్థను తీసుకు వచ్చి భూ సమస్యలు… వివాదాలు లేకుండా చేస్తామన్న కేసీఆర్‌కు ఇప్పుడు ఆ వ్యవస్థ చుక్కలు చూపిస్తోంది. అందులో ఎన్నో లోపాలు బయటపడుతున్నాయి. దాదాపుగా ప్రతీ గ్రామంలోనూ భూ సమస్యలు కనిపిస్తున్నాయి. సమస్యలను సులువుగా పరిష్కరించడానికి, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఉద్దేశించిన ధరణి వ్యవస్థ కొత్త కష్టాలను తెచ్చింది. సంక్లిష్టంగా మారి ఎవ్వరికీ అంతుచిక్కని రహస్యంగా తయారైందన్న ఆరోపణలు.. విమర్శళు ఎక్కువగా వస్తున్నాయి.

భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం క్షేత్రస్థాయిలో సక్రమంగా జరగలేదన్న విమర్శలు కొద్ది రోజుల నుంచి ఉన్నాయి. రైతుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఈ కారణంగా 2018లో పట్టాదారు పాసు బుక్కుల పంపిణీ గందరగోళంగా మారిందన్న అభిప్రాయం ఉంది. భూమి అనుభవిస్తున్న లక్షలాది మంది రైతులు భూమిపై హక్కు కోల్పోయారని.. కొత్త పుస్తకాలు రాక ఇప్పటికీ తహసీల్దారు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. నాలుగేళ్లయినా పాసుబుక్కులు రాక, ఆన్‌లైన్‌లో భూముల వివరాలు నమోదు కాక సుమారు పాతిక లక్షల ఎకరాల పట్టా భూమి లెక్కల్లో లేకుండా పోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో రైతుల్లో అసంతృప్తి పెరిగిపోయింది.

ఇటీవల బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పెద్ద ఎత్తున ధరణిపై ఆరోపణలు చేస్తున్నాయి. ఈ వ్యవస్థను తీసుకు రావడం వెనుక భారీ కుట్ర ఉందని చెబుతున్నాయి. భూములను తమ వారికి కట్టబెట్టే కుట్రతోనే ధరణి వ్యవస్థను తెచ్చారని ఆరోపిస్తున్నారు. ధరణి వల్ల వచ్చినసమస్యలను హైలెట్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకూ ధరణి ద్వారా సమస్యలు ఉన్నాయని చెప్పడం లేదు. అద్భుతమైన వ్యవస్థ అని చెబుతోంది. కానీ కోర్టుల్లో కూడా ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. సీఎం కేసీఆర్ ఈ అంశంపై దృష్టి పెట్టకపోతే ప్రభుత్వంపై రైతుల అసంతృప్తి పెరిగిపోవడానికి మరో కారణం దొరికినట్లవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

సీఎస్, డీజీపీ బదిలి ఇంకెప్పుడు !?

ఏపీలో వ్యవహారాలన్నీ గీత దాటిపోతున్నాయి. ఎన్నికలకోడ్ ఉన్నా.. రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతోంది. ఐపీసీ సెక్షన్ల కాకుండా జేపీసీ సెక్షన్లతో పోలీసులు రాజకీయ కేసులు పెట్టేస్తున్నారు. అమాయకుల్ని బలి చేస్తున్నారు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close