కవితమ్మ మనసులో మాట!

తెలంగాణాలో అన్ని సమస్యలకు తెదేపా-బీజేపీలు పొత్తులు పెట్టుకోవడమే మూలకారణమని నిజామాబాద్ తెరాస ఎంపి కవితమ్మ భలే కనిపెట్టేశారు. తన తండ్రి కేసీఆర్ తెలంగాణా రాష్ట్రాన్ని సాధించిన తరువాత ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కృషి చేస్తుంటే దానికి తెదేపా అవరోధాలు సృష్టిస్తోందని, వారి పార్టీతో బీజేపీ పొత్తులు పెట్టుకొన్న కారణంగా బీజేపీ నేతలు మౌనం వహిస్తున్నారని ఆమె ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్న తెదేపాతో చేతులు కలిపి ముందుకు సాగితే దాని వలన బీజేపీయే ఎక్కువ నష్టపోవలసి వస్తుందని ఆమె అన్నారు.
ఆమె తన మనసులో మాటని చాలా అందంగా పొందికగా చెప్పడం చూస్తుంటే చాలా ముచ్చటేస్తోంది. తనకి కేంద్రమంత్రి పదవి చేప్పట్టాలనే కోరిక ఉందని ఇదివరకే ప్రకటించేశారు. కానీ ఎన్డీయే కూటమిలో భాగస్వామి కాకుండా అది సాధ్యం కాదు కనుక ఆమె ఈ సరికొత్త సిద్దాంత్తాన్ని ఆవిష్కరించినట్లున్నారు. తెదేపాతో బీజేపీ జత కట్టడం తమ పార్టీకి ఏమాత్రం నచ్చడం లేదని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న తమతో బీజేపీ చేతులు కలిపితే బాగుంటుందని ఆమె పరోక్షంగా సూచిస్తున్నప్పటికీ, పరమార్ధం మాత్రం కేంద్రమంత్రి పదవేనని భావించవచ్చును. ఎందుకంటే తెదేపాతో బీజేపీ కటీఫ్ చేసుకొంటే తరువాత జరిగేది అదే కనుక. అసలు విషయాన్ని దాచిపెట్టి కొసరు విషయాన్ని ఇంత గొప్పగా చెప్పడం మామూలు విషయమేమీ కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close