ఎల్వీపై టీటీడీ అధికారుల ఆగ్రహం..! ఈవో పద్దతిగా ఇచ్చినకౌంటర్ ఇదే..!

ఎన్నికల సంఘం నియమించిన ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తున్న తీరు ఉద్యోగవర్గాల్లోనే కలకలం రేపుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన బంగారాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌… తిరుమలకు తీసుకు వచ్చి.. అప్పగించే విషయంలో.. మధ్యలో.. ఎన్నికల అధికారులు పట్టుకోవడం వివాదాస్పదం అయింది. ఈ వివాదంలో .. టీటీడీ తప్పేమీ లేదు. పూర్తిగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ వ్యవహారం. వడ్డీ ఎక్కువ ఇవ్వలేని కారణంగా.. బంగారం డిపాజిట్ గడువు ముగిసిన వెంటనే… బంగారాన్ని.. పంజాబ్ నేషనల్ బ్యాంక్.. టీటీడీకి అప్పగించాలని నిర్ణయించుకుంది. అందుకే… 1381 కేజీల బంగారాన్ని… చెన్నై నుంచి తిరుమలకు తరలిస్తూండగా.. ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. అయితే సరైన పత్రాలు చూపించలేదన్న కారణంగా రెండు రోజులు.. వారి అధీనంలోనే బంగారం ఉంది. దీనిపై.. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం అత్యుత్సాహం చూపించారు. తాను టీటీడీ ఈవోగా చేసినప్పటికీ.. ఎలాంటి ఆలోచన చేయకుండా.. విచారణకు ఆదేశించారు. ఓ ఉన్నతాధికారిని కూడా ఈ పనికి పురమాయించారు.

ఎల్వీ తీరు.. టీటీడీ ఉన్నతాధికారుల్లో తీవ్ర అసహనానికి కారణం అయింది. వెంటనే.. టీటీడీ ఈవో.. అశోక్ కుమార్ సింఘాల్ ప్రెస్ మీట్ పెట్టి ఎల్వీ పేరు ప్రస్తావించకుండానే… అసలు ఏ మాత్రం సంబంధం లేకపోయినా .. టీటీడీని నిందించడమేమిటన్నట్లుగా మాట్లాడారు. అసలు బంగారం.. తీసుకు వచ్చి.. టీటీడీ ఖజానాకు అప్పగించే బాధ్యత పంజాబ్ నేషనల్ బ్యాంకుదేనని.. ఆ బ్యాంక్ ఎలా తీసుకొస్తే.. టీటీడీకి ఏం సంబంధంమని ప్రశ్నించారు. బంగారం తీసుకు వచ్చి ఖజానాలో జమ చేసినప్పుడు మాత్రమే… పీఎన్‌బీ బాధ్యత తీరుతుందన్నారు. అప్పుడే టీటీడీకి బంగారం చేరినట్లని స్పష్టం చేశారు. అసలు సంబంధం లేని అంశంలో.. టీటీడీ నిర్లక్ష్యం ఎలా ఉంటుందని సింఘాల్ ప్రశ్నించారు. ఈసీ సీజ్‌ చేసేటప్పుడు డాక్యుమెంట్లు ఉన్నాయని పీఎన్‌బీ అధికారులు చెప్పారని…వాళ్లు ఈసీకి ఎలాంటి డాక్యుమెంట్లు చూపారో ఎలా తెలుస్తుందన్నారు. బంగారాన్ని వాళ్లు ఎలా తరలిస్తారో… ఏ వాహనంలో తీసుకొస్తారో టీటీడీకి ఎందుకు చెబుతారని ప్రశ్నించారు.

ఏప్రిల్‌ 18కి బదులు ఏప్రిల్‌20న బంగారం అందజేశారని బంగారం వచ్చేంత వరకే….మిగిలిన విషయాలు మాకు అవసరం లేదని స్పష్టం చేశారు. బంగారం ఎలా వస్తే ఏంటి? బంగారం మాకు అందిందా అనేది ముఖ్యమన్నార.ు కేజీ బంగారం డిపాజిట్‌ చేయాలన్నా బోర్డు నిర్ణయం తీసుకుంటామన్నారు. టీటీడీకి రావాల్సిన బంగారం వచ్చినందున మరింత స్పష్టత ఇస్తున్నామన్నారు. గోల్డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ 2000 ఏప్రిల్‌ 1న ప్రారంభమైందని… ఎస్‌బీఐలో 5387 కిలోల బంగారం ఉందన్నారు. టీటీడీకి సంబంధించి మొత్తం 9,259 కిలోల బంగారం ఉందని లెక్కలు చెప్పారు. మొత్తానికి ఎల్వీ సుబ్రహ్మణం విచారణ అధికారిని నియమించడమే కాదు.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని అత్యుత్సాహంగా ప్రకటన చేయడంతో.. ఉన్నతాధికారులు నొచ్చుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close