ఇంట్లో కూర్చొని మెసేజులు పెట్టడం కాదు…వెళ్లి పోరాడాలి

ఈ మాట వినగానే అది ఎవరిని ఉద్దేశించి అన్నదో ఎవరికయినా ఇట్టే అర్ధమయిపోతుంది. ఎందుకంటే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ రాజధాని కోసం రైతులపై భూసేకరణ చట్టాని ప్రయోగించవద్దని ఏపీ ప్రభుత్వానికి వరుస పెట్టి ట్వీట్ మెసేజులు పెడుతున్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావు కూడా ట్వీటర్లో పవన్ కళ్యాణ్ న్ని బాగా ఫాలో అవుతున్నారో లేక పవన్ కళ్యాణ్ చేసే ట్వీట్ల గురించి న్యూస్ పేపర్లలో వస్తున్న వార్తలు చూసి స్పందించారో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ ఆయన ఓ సలహా ఇచ్చారు.

ఇంట్లో కూర్చొని ట్వీటర్ మెసేజులు పెట్టే బదులు రాజధాని ప్రాంతానికి వెళ్లి అక్కడి రైతుల కోసం పోరాడమని వి.హెచ్. పవన్ కళ్యాణ్ కి సూచించారు. ఏపీ ప్రభుత్వం రైతులపై భూసేకరణ చట్టం ప్రయోగించి వారి భూములు లాకొంటుంటే పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లి రైతులకు అండగా నిలబడాలని వి.హెచ్. సలహా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా తను త్వరలోనే ఉండవల్లి, పెనుమాక, బేతపూడి తదితర గ్రామాలలో పర్యటించి రైతులను కలుస్తానని ట్వీట్ మెసేజ్ పెట్టారు. ఈరోజు నుండే రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చట్టం క్రింద కొందరు రైతులకు నోటీసులు ఇవ్వడం మొదలుపెట్టింది. ఒకవేళ పవన్ కళ్యాణ్ కి రైతుల తరపున పోరాడే ఉద్దేశ్యం ఉంటే ఇంకా మీనమేషాలు లెక్కపెట్టనవసరం లేదని వి.హెచ్. సూచిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ తుళ్ళూరు వెళ్లేందుకు ముహూర్తం ఇంకా ఖరారు చేసుకొన్నారో లేదో మళ్ళీ ఆయన ట్వీట్ మెసెజ్ పెడితే గానీ తెలియదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close