పాక్ వ్యూహం ఫలించినట్లే ఉంది

ఊహించినట్లే పాకిస్తాన్ వ్యూహం ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం డిల్లీలో జరగవలసిన భారత్-పాక్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రద్దు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇరు దేశాలమధ్య మళ్ళీ సంబంధాలు పునరుద్దరించుకొనే ప్రయత్నంలో ఈ సమావేశం నిర్వహించాలని భారత్, పాక్ ప్రధానులు మోడీ, నవాజ్ షరీఫ్ రష్యాలో కలిసినప్పుడు అంగీకరించారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తలు నెలకొన్న దృష్ట్యా ఈ సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉంది. పాకిస్తాన్ నిజంగా శాంతి కోరుకొని ఉండి ఉంటే ఈ సమావేశానికి అనువయిన వాతావరణం కల్పించేందుకు తనవంతు కృషి చేసేది. కానీ ఇరు దేశాల ప్రధానులు రష్యాలో సమావేశం అవుతున్న సమయంలో కూడా భారత్-పాక్ సరిహద్దుల వద్ద పాక్ దళాలు భారత్ దళాలపై కాల్పులు జరుపుతూనే ఉన్నారు. అప్పటి నుండి నేటి వరకు ఆ కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. వాటికి అధనంగా పంజాబ్ మరియు జమ్మూలో పాక్ ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. అయినప్పటికీ భారత్ ఈ సమావేశాన్ని రద్దు చేయలేదు. కానీ ఈ సమావేశానికి హాజరయితే సరిహద్దులలో కాల్పుల గురించి, పంజాబ్, ఉదంపూర్ లలో ఉగ్రవాదుల దాడుల గురించి, పట్టుబడ్డ పాక్ ఉగ్రవాది ఉస్మాన్ ఖాన్ గురించి భారత్ అడగబోయే అనేక ప్రశ్నలకు పాకిస్తాన్ జవాబులు, సంజాయిషీలు చెప్పుకోవలసి వస్తుంది. అందుకే పాక్ ఈ సమావేశాన్ని ఏదో విధంగా తప్పించుకొనేందుకు తనకు అలవాటయిన ఎత్తు వేసింది.

భారత్ అభ్యంతరాలను పట్టించుకోకుండా పాక్ హైకమీషనర్ అబ్దుల్ బాసిత్ గతేడాది కాశ్మీరీ వేర్పాటువాదులతో డిల్లీలో సమావేశమయినందుకు భారత్ ఆగ్రహించి ఇస్లామాబాద్ లో జరగవలసిన భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల సమావేశాన్ని ఏకపక్షంగా రద్దు చేసుకొంది. కనుక ఇప్పుడు కూడా పాక్ మళ్ళీ అదే ఎత్తు వేసింది.

ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం కంటే ముందు పాక్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ కాశ్మీరీ వేర్పాటువాద సంస్థ హురియత్ నేతలతో డిల్లీలో పాక్ హై కమీషన్ కార్యాలయంలో సమావేశం అయ్యేందుకు నిశ్చయించుకొన్నారు. అందుకు భారత్ సహజంగానే తీవ్ర అభ్యంతరం చెప్పింది. కానీ హురియత్ నేతలతో సమావేశం అయ్యి తీరుతామని పాకిస్తాన్ స్పష్టం చేసింది. ఊహించినట్లే ఈసారి కూడా భారత్ సోమవవారం జరగవలసిన జాతీయ భద్రతా సలహాదారుల సమావేశాన్ని రద్దు చేసుకొనేందుకు ఆలోచిస్తున్నట్లు తాజా సమాచారం.

పాక్ కోరుకొంటున్నది కూడా అదే. తన చేతికి మట్టి అంటకుండా భారత్ తనంతట తానే ఏకపక్షంగా ఈ సమావేశాన్ని రద్దు చేసుకొన్నట్లయితే భారత్ కి సంజాయీషీలు చెప్పుకొనే బాధ తప్పుతుంది. అలాగే తాము భారత్ తో ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్దరించుకోవాలని గట్టిగా కోరుకొంటున్నప్పటికీ భారత్ ఏదో ఒక కుంటిసాకులు చూపిస్తూ ఈసారి కూడా ఏకపక్షంగా సమావేశాన్ని రద్దు చేసుకొందని తిరిగి భారత్ ని నిందించవచ్చును. అంతేకాదు, తమదేశాన్ని అప్రదిష్ట పాలుజేసేందుకే భారత్ ఇటువంటి కుటిల ఆలోచనలు చేస్తోందని అంతర్జాతీయ వేదికల మీద భారత్ ని నిందించే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఈ సమావేశం రద్దు అయ్యేందుకు భారత్ ని ఎంతగా రెచ్చగొట్టవచ్చో అన్ని ప్రయత్నాలు పాకిస్తాన్ చేస్తోంది. భారత్ స్నేహ హస్తం అందిస్తున్నప్పుడు దానిని అందుకొని తన దేశంలో కూడా అభివృద్ధి సాధించుకొనే ప్రయత్నం చేయకపోగా అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని చేజేతులా చెడగొట్టుకొనే ప్రయత్నాలు చేస్తోంది. అది ఆ దేశ ప్రజల దురదృష్టమే తప్ప భారత్ ది కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close