బ్రేకింగ్: వైఎస్ఆర్సీపీకి వంగవీటి రాధా రాజీనామా

ఎన్నికలకు మరో మూడు నాలుగు నెలలే ఉండగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. వైస్సార్సీపీ కీలక నేత వంగవీటి రాధా వైయస్సార్సీపి పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఇవాళ వంగవీటి రాధా పార్టీ అధినేత జగన్ కు పంపించారు.

ఈ లేఖలో వంగవీటి రాధా, తనది ఒకరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే మనస్తత్వం కాదని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం న్యాయ సంరక్షణ కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తానని, దమనకాండకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని కొనసాగిస్తానని వంగవీటి రాధా ఈ లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ లేఖలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మీద కూడా వంగవీటి రాధా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కావాలనే మీ కాంక్ష నెరవేర్చుకోవడం కోసం మీరు పార్టీలోని అందరి మీద ఆంక్షలు విధిస్తున్నారు. అయితే నా కాంక్ష నెరవేరాలంటే ఎటువంటి ఆంక్షలు లేని పార్టీలో చేరాల్సి ఉంది అంటూ వంగవీటి రాధా చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.

వంగవీటి రాధా 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా విజయవాడ నుంచి ఎన్నికయ్యారు. తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు కానీ అక్కడ ఓడిపోయారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం అయ్యాక వైఎస్ఆర్ సీపీలో చేరారు కానీ మళ్లీ ఎమ్మెల్యే గా ఎన్నిక కాలేకపోయారు. ఇప్పుడు వైఎస్ఆర్ సీపీని వీడిన తర్వాత ఏ పార్టీలో చేరుతారనేది ఇంకా సస్పెన్స్ గా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close