టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన వారికి వీర్రాజు షాక్..!

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తన టీంను ప్రకటించారు. గతంలోలా జంబో టీంను కాకుండా.. చాలా పరిమితంగా అంటే 40 మందితోనే కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ మాధవ్, నాగోతు రమేష్ నాయుడు వంటి వారే కాస్త బయట ప్రపంచానికి పరిచయం. మిగతా వారు జిల్లా స్థాయిలో కూడా.. పెద్దగా గుర్తింపు లేని నాయకులే. భారతీయ జనతా పార్టీలో అంతకు మించి ప్రజాబాహుళ్యంలో గుర్తింపు ఉన్న వారిని ఆశించడం కష్టమే కానీ.. సోము వీర్రాజు మాత్రం తనదైన ప్రత్యేకత చూపించారు. అదేమిటంటే.. కేవలం ఆరెస్సెస్ నేపధ్యం ఉన్న వారిని.. తన భావజాలంతో సరిపడేవారికి మాత్రమే ప్రాధాన్యం కల్పించారు. అయితే బీజేపీలో పదవుల కోసం పోటీపడేవారు పెద్దగా లేరు. ఉన్నా… వారు అసంతృప్తికి గురైన పెద్దగా పోయేదేం లేదు.

సోము వీర్రాజు టీంలో కొట్టొచ్చినట్లుగా కనిపించిన మార్పు.. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారిని పక్కన పెట్టడం. గత ఎన్నికల తర్వాత వివిధ కారణాలతో నేతలు బీజేపీలో చేరారు. ఇలా చేరిన వారిలో లంకా దినకర్, ఆదినారాయణ రెడ్డి, గోనుగుంట్ల సూర్యనారాయణ, సామినేని యాదిని సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. వీరెవరికి కార్యవర్గంలో కనీసం చోటు దక్కలేదు. మంచి వాగ్ధాటి ఉన్న లంకా దినకర్‌ను సైతం పక్కన పెట్టేశారు. సాదినేని యామిని పరిస్థితి కూడా అంతే. ఆమెపై ప్రభుత్వం కేసులు పెట్టినా బీజేపీ పట్టించుకోలేదు. ఇప్పుడు ఏ పదవి ఇవ్వలేదు. టీడీపీ నుంచి వచ్చిన వారు.. ఆ పార్టీ కోవర్టులని వైసీపీ నేతలు విమర్శిస్తూ ఉంటారు. సాక్షి మీడియాలోనూ ప్రముఖంగా రాస్తూ ఉంటారు. వాటిని సోము వీర్రాజు బలంగా నమ్మినట్లుగా కనిపిస్తోంది.

వైసీపీ దాడుల నుంచి రక్షణలో… టీడీపీలో పరిస్థితులు బాగోలేకో… బీజేపీలో చేరిన వారికి ఇప్పుడు రాజకీయ భవిష్యత్ ఇబ్బందుల్లో పడిపోయింది. ఈ పరిస్థితి ఇక ముందు బీజేపీలో చేరాలనుకునేవారికి ఓ పాఠంలా ఉంటుందని .. ఎవరూ ముందుకు రారని.. బీజేపీలోని కొంత మంది నేతలు గొణుక్కుంటున్నారు. వలసల్ని నిలిపివేసి… టీడీపీ నుంచి బయటకు వెళ్లే వారెవరైనా ఉంటే వారు వైసీపీలోకే వెళ్లేలా సోము వీర్రాజు ఈ కొత్త కార్యకర్గానికి ప్లాన్ చేశారనే విమర్శలు ఆయన వ్యతిరేక వర్గం నుంచి వినిపిస్తున్నాయి. ఎలా చూసినా.. సోము వీర్రాజు కార్యవర్గం వైసీపీనే కాదు.. టీడీపీని కూడా సంతృప్తి పరుస్తుంది. కానీ సొంత నేతల సంగతి మాత్రం సోము వీర్రాజుకే తెలియాల్సి ఉంది..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close