ఈ దీపావ‌ళికీ త‌మిళ ట‌పాసులే

దీపావ‌ళి సీజ‌న్‌లో తెలుగు సినిమాల‌కు పెద్ద‌గా స్కోప్ ఉండ‌దు. దీపావ‌ళి రిలీజ్ క‌లిసొచ్చిన సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌. అందుకే దీపావ‌ళికి టాలీవుడ్ పెద్ద‌గా ప‌ట్టించుకోదు. అయితే త‌మిళం నుంచి మాత్రం విరివిగా సినిమాలొస్తాయి. త‌మిళ‌నాట దీపావ‌ళి మంచి సీజ‌న్‌. అగ్ర హీరోలు అక్క‌డ దీపావ‌ళికి త‌మ సినిమాల్ని రిలీజ్ చేసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డుతుంటారు. ఈసారి కూడా త‌మిళ సినిమాల హ‌డావుడి బాగానే ఉంది. అవే తెలుగునాట కూడా విడుద‌ల అవుతున్నాయి. అంటే ఈసారి దీపావ‌ళికి కూడా డ‌బ్బింగ్ సినిమాలే దిక్క‌న్న‌మాట‌.

కార్తి కొత్త సినిమా `ఖైదీ` ఈ దీపావ‌ళికి విడుదల కానుంది. వ‌రుస ఫ్లాపుల‌తో కార్తి కెరియ‌ర్ బాగా డ‌ల్ అయిపోయింది. ఇప్పుడు హిట్టు కొట్ట‌క‌పోతే… త‌న ఇమేజ్‌కి మరింత డామేజీ జ‌రుగుతుంది. అందుకే ఖైది విష‌యంలో తాను చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడు. త‌న‌కు అచ్చొచ్చిన రియ‌లిస్టిక్ క‌థ‌నే ఎంచుకున్నాడు. ట్రైల‌ర్ కూడా బాగానే క‌ట్ చేశారు. దానికి మంచి స్పంద‌న వ‌స్తోంది. మ‌రోవైపు దీపావ‌ళి రోజున విజ‌య్ `విజిల్‌` కొట్ట‌బోతున్నాడు. అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ఇది. ఈ సినిమాపై త‌మిళ‌నాట భారీ అంచ‌నాలున్నాయి. ఈ సినిమా కూడా తెలుగులో విడుద‌ల కానుంది. ఈ దీపావ‌ళికి కార్తి, విజ‌య్‌ల మ‌ధ్యే పోటీ నెల‌కుంది. విజ‌య్‌తో పోలిస్తే కార్తికి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. కాక‌పోతే… ఖైది ఊర మాస్ సినిమా. విజిల్‌కి అటు బీ,సీ సెంట‌ర్ల‌లోనూ, ఇటు మ‌ల్టీప్లెక్స్‌లోనూ క్రేజ్ ఏర్ప‌డొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close