కిందపడినా తనదే పైచేయి అంటున్న విజయసాయిరెడ్డి..!

సభా సంప్రదాయాలు తెలియకుండా.. వ్యవహరించి… నవ్వుల పాలవడం.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సహజంగా మారిపోతోంది. పార్లమెంట్ సమావేశాల కంటే ముందే నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో.. జగన్మోహన్ రెడ్డి జైలు జీవితం గురించి ప్రస్తావించి.. అమిత్ షాతో అక్షింతలు వేయించుకున్నారు. ఇతర పార్టీల నేతలు.. కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా జరిగిందని… టీడీపీ సభ్యులు బయట మీడియాకు చెప్పారని.. ఆ విషయాలను మీడియా రాసిందని.. ఆయన ఏకంగా సభా హక్కుల నోటీసు ఇచ్చారు. ఈ నోటీసు చూసి రాజకీయవర్గాలన్నీ.. మరోసారి నవ్వుకుంటున్నాయి. సభబయట జరిగిన విషయాన్ని తీసుకొచ్చి సభా హక్కుల నోటీసులు ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తున్నాయి.

ఇదొక్కటే.. కాదు విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రతీసారి నవ్వుల పాలవుతోంది. తొలి రోజు రాజ్యసభలో.. ఆయనపై వెంకయ్యనాయుడు మండిపడ్డారు. జీవో అవర్ లో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూండటంతో.. వెంకయ్యనాయుడు.. రూల్స్ వివరించి.. అన్నీ తెలుసుకుని రావాలని మందలించారు. దాంతో.. విజయసాయిరెడ్డి సైలెంట్ గా కూర్చోవాల్సి వచ్చింది. విజయసాయిరెడ్డి పలు సందర్భాల్లో.. నిబంధనలకు విరుద్ధంగా.. తాను అన్నింటికీ అతీతుడ్నన్నట్లుగా వ్యవహరిస్తూంటారన్న చర్చ పార్లమెంట్ లాబీల్లో జోరుగా సాగుతోంది.

ఆయన పదే పదే అభాసు పాలవుతున్నా.. తనదే పైచేయి అని చెప్పుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు.. మరింతగా.. ఆయన పై జాలి కలిగేలా చేస్తున్నాయంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. వైసీపీ తరపున..పీఎంవోలనూ పలుకుబడి సాధించిన ఆయన ఇప్పుడు.. కనీసం.. ఓ కేంద్రమంత్రి అపాయింట్‌మెంట్ కూడా పొందలేకపోతున్నారు. అధికారం అందిన ఉత్సాహంలో ఆయన చేసిన పొరపాట్లే దీనికి కారణం అంటున్నారు. దీనిని తెలుసుకోకుండా..ఇంకా ఇంకా విజయసాయిరెడ్డి గీత దాటిపోతున్నారన్న చర్చ జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close