“పోస్కో” చేతికి విశాఖ స్టీల్ ప్లాంట్..!?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో రెండు రోజుల కిందట… పోస్కో అనే స్టీల్ ఉత్పత్తిలో దిగ్గజం లాంటి పరిశ్రమ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియా ప్రకటించింది. దీంతో.. ఆయన తన సొంత ప్రాంతం కడపలో ఏడాది కిందట శంకుస్థాపన చేసిన స్టీల్ ఫ్యాక్టరీని పోస్కో భాగస్వామ్యంతో నిర్మిస్తారేమోనని అందరూ అనుకున్నారు. కానీ.. అసలు విషయం మాత్రం వేరే ఉందని చెబుతున్నారు. విశాఖ స్టీల్‌ను పోస్కోకు కట్టబెట్టాలన్న చర్చలు జరిగాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్మిక సంఘాలు ఇప్పుడు ఈ విషయంపై ఆందోళనలు ప్రారంభించాయి.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను జాయింట్‌ వెంచర్‌ పేరుతో పోస్కో సంస్థకు కట్టబెట్టే ప్రయత్నాలు కొంత కాలంగా సాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. బిజెపి ప్రభుత్వానికి భయపడి రాష్ట్ర ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌ భూములను అప్పగించడానికి సిద్ధమైందన్న ఆరోపణలను స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు చేస్తున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ జరిగిన ఉద్యమంతో.. ఏపీ ప్రజలు స్టీల్ ప్లాంట్‌ను సాధించుకున్నారు. 7.3 మిలియన్‌ టన్నుల ప్లాంట్‌గా అభివృద్ధి సాధించింది. దాదాపు లక్షమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్నారు. స్టీల్ ప్లాంట్‌ని మరింతగా విస్తరించాలన్న డిమాండ్ ఎటూ ఉంది. దాని కోసం కావాల్సినన్ని భూములు ఉన్నాయి.అయితే ఆ భూములను పోస్కో సంస్థకు కేటాయించాలని నిర్ణయించారని తెలుస్తోంది.

స్టీల్‌ప్లాంట్‌ భూములను పోస్కోకు కేటాయించడంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని స్టీల్‌ అఖిలపక్ష కార్మిక సంఘాలు ఆందోళనలు ప్రారంభించాయి. త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకోవడానికి ప్రాణాలను కూడా లెక్క చేయబోమని వారంటున్నారు. పోస్కోతో చర్చల వివరాలను ముఖ్యమంత్రి బహిర్గతం చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రశాంత్ కిషోర్‌పై జగన్ తరహాలోనే దీదీ ఆక్రోశం !

టీడీపీ, బీజేపీలను గెలిపించేందుకే ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించినట్లుగా ఓ వీడియోను వైసీపీ హైలెట్ చేస్తోంది. కానీ ఆయన క్షేత్ర స్థాయిలో వర్క్ చేయడం లేదని.. కేవలం...

సజ్జల రాజీనామా చేస్తే ఏమవుతుంది !?

ఏపీలో సలహాదారులకు కూడా కోడ్ వర్తిస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ప్రభుత్వ సలహాదారు రాజకీయ వ్యవహారాలు మాట్లాడేందుకు వీలు లేదు. అయినా సజ్జల...

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపులు…మహిళ సూసైడ్..!?

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది అత్యుత్సాహం ఓ మహిళా నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.కనీస మానవత్వం చూపకుండా బెదిరింపులకు దిగడంతో ఓ నిరుపేద మహిళా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లా కొత్తపేటకు...

మేనిఫెస్టో మోసాలు : జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఏది బ్రో !

చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి పథకం పెట్టి.. భృతి ఇచ్చి.. ఇలా భృతి తీసుకునేవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఉద్యోగాలిచ్చేలా వ్యవస్థను సృష్టిస్తే.. జగన్ ెడ్డి ఏపీకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close