ఏపీ ఉన్నతాధికారుల డిష్యూం..డిష్యూం..!

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నతాధికారులు ఆధిపత్య పోరాటంలో… ఒకరిపై ఒకరు చర్యలు తీసుకోవడానికి తమ అధికారాలన్నింటినీ ఉపయోగించుకుంటున్నారు. కొద్ది రోజులుగా.. సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు ఉన్న అధికారాలన్నింటినీ… ఇటీవలే… జగన్‌కు పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులైన ప్రవీణ్ ప్రకాష్..తనకు తానే ధారదత్తం చేసుకున్నారు. ఈ మేరకు బిజినెస్ రూల్స్ మార్చుతూ.. సంచలనత్మాక ఉత్తర్వులు ఇచ్చారు. ఈ విషయంపై.. ఎల్వీ సుబ్రహ్మణ్యం ముఖ్యమంత్రి వద్ద పంచాయతీ పెట్టినా ప్రయోజనం లేకపోయింది. స్వయంగా జగన్మోహన్ రెడ్డి.. ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని.. ఇక తన వద్దకు రావొద్దని.. ఏమైనా ఉంటే… ముఖ్య సలహాదారు కల్లం అజేయరెడ్డి వద్ద మాట్లాడుకోమని ముఖం మీదనే చెప్పేశారన్న ప్రచారం.. సెక్రటేరియట్‌లో జరుగుతోంది. ఈ వ్యవహారం ఇలా ఉండగనే.. కేబినెట్ సమావేశం… ఎల్వీని మరింతగా.. అవమానించేలా జరిగింది.

గత బుధవారం జరిగిన కేబినెట్‌ భేటీలో… ఎజెండాలో లేని అంశాలున్నాయి. ఆ అంశాలను.. విధివిధానాలు పాటించకుండా కేబినెట్‌ అజెండాలో అంశాలు చేర్చారని.. సీఎస్‌కు కేబినెట్ భేటీ ప్రారంభమైన తర్వాతే తెలిసింది. దీన్నే అవకాశంగా తీసుకుని జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌కు సీఎస్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో వివరణ కోరారు. ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో కేబినెట్‌ అజెండాలో అంశాలను ప్రవీణ్‌ ప్రకాష్‌ చేర్చారు. నిజానికి కేబినెట్ భేటీలో ఏయే అంశాలు రావాలన్నది.. సీఎస్ .. అన్ని శాఖల నుంచి వివరాలు తీసుకుని ఎజెండా ఖరారు చేస్తారు. కానీ.. ప్రవీణ్ ప్రకాష్.. అసలు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉనికి గుర్తించడానికి కూడా సిద్ధపడటం లేదు కాబట్టి.. ఆయనే.. కీలకమైన అంశాలు రెడీ చేస్తున్నారు. దీంతో.. ఆధిపత్య పోరాటం ప్రారంభమయింది.

ఐదు నెలల కాలంలో.. అధికారులు ఎవరూ.. తమ తమ బాధ్యతల్లో కుదురుకోలేకపోయారు. అనేక సార్లు… బదిలీలు జరిగాయి. సీఎంవో అధికారుల ఇష్టారాజ్యం అయిపోయింది. సీఎంతో సాన్నిహిత్యం ఉన్న ప్రతి ఒక్కరూ తాము సీఎస్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం సెక్రటేరియట్‌లో జరుగుతోంది. ప్రవీణ్ ప్రకాష్ సీఎంవోలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మరింత సీరియస్‌గా మారింది. కొద్ది రోజుల కిందటి వరకూ.. ఢిల్లీలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ప్రవీణ్ ప్రకాష్ ఉండేవారు. తిరుమల ఆలయానికి సంబంధించి లోకల్ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ గా ఆయన ఉంటారు. టీటీడీ నిధుల విషయంలో ఆయన అవినీతికి పాల్పడ్డారంటూ.. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి… ఓ చిన్న స్థాయి అధికారితో విచారణ జరిపించారు. దీనిపై ప్రవీణ్ ప్రకాష్.. ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందో.. కానీ.. నేరుగా ఆయనను.. సీఎంవోలోనే తెచ్చి పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన… వ్యవహారం చర్చనీయాంశమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close