సర్కార్ వారి వైన్స్ ఆరు గంటలకే ఓపెన్..!

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల్ని ఉదయం ఆరు గంటలకే తెరవాలని నిర్ణయించారు. ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకూ మద్యం అమ్ముతారు. ఆ తర్వాత మూసేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత మనుషులెవరూ రోడ్ల మీద కనపడకుండా చూసేంత కఠినంగా కర్ఫ్యూ ఉండాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగా ఆర్టీసీ బస్సుల్ని కూడా పన్నెండు గంటలకల్లా డిపోలకు చేరుస్తారు. దుకాణాలను కూడా పన్నెండు గంటలకు మూసేస్తారు. మందుల దుకాణాలను మాత్రమే ఎమర్జెన్సీ కేటగిరిలో అనుమతిస్తారు. ఆస్పత్రులు యధావిధిగా పని చేస్తాయి.

అసలు ఎవరూ రోడ్ల మీద తిరగకుండా చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించడంతో దుకాణాలు తెరిచి ఉన్నా.. ప్రయోజనం ఉండదు. అందుకే.. ఉదయం పన్నెండు కల్లా మద్యం దుకాణాలను కూడా క్లోజ్ చేస్తారు. అందుకే ఆరు గంటలకే తెరవాలని నిర్ణయించారు. రెగ్యులర్ టైమింగ్ ప్రకారం ఉదయం పదకొండు గంటలకు తెరిచి.. పన్నెండు గంటలకు మూసేయడం సాధ్యం కాదు. ఒక్క గంట సేపు మద్యం దుకాణాలు తెరిస్తే.. పరిమితంగా ఉన్న దుకాణాల కారణంగా పెద్ద ఎత్తున మందుబాబులు దుకాణాల వద్ద గుమికూడతారు.

ఉదయమే ఆరు గంటలకు తెరిస్తే… విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినా ప్రభుత్వం ముందుకే వెళ్లింది. మద్యం ఆదాయం విషయంలో ఏపీ సర్కార్ చాలా సీరియస్‌గా ఉంది. ప్రస్తుతానికి ఆ ఆదాయమే.. ఎక్కువగా ప్రభుత్వాన్ని ఆదుకుంటోంది. అది కూడా తగ్గిపోతే ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందుకే ప్రభుత్వం మధ్యేమార్గంగా.. ఆరు గంటలకే తెరవడానికి సిద్దమయింది. మందు బాబులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా .. ప్రభు్తవ ఆదాయానికి పట్టింపు లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close