దేశమంతా వైసీపీ వైపే చూస్తోంది – అసహ్యంతో !

జగన్ మోహన్ రెడ్డి చెప్పాడంటే చేస్తారంతే. ఇంకా చెప్పాలంటే… చెప్పిన డెడ్ లైన్ కంటే ముందే చేసేస్తారు. ఐ ప్యాక్ ఆఫీసుకు వెళ్లి ఎన్నికల ఫలితాలు దేశం మొత్తం షాక్ కు గురి చేస్తాయని అందరూ వైసీపీ వైపు చూస్తారని చెప్పుకొచ్చారు. ఆ పనిని ముందే చేసి చూపించారు. ఇప్పుడు దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోంది. ఇంత అరాచక పార్టీని ప్రజలు ఎలా భరిస్తున్నారని ఆశ్చర్యపోతున్నారు. ఎన్నికల సమయంలో చోటు చేసుకుంటున్న వరుస ఘర్షణల్లో వైసీపీ నేతల నిర్వాకం ఒకటొకటిగా బయటకు వస్తోంది.

పోలింగ్ రోజున వైసీపీ నేతలు చేసిన దాడులు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బీహార్, బెంగాల్ లోనూ ఇంత బహిరంగ దాడులు ఉండవని ఆశ్చర్యపోయారు. పోలీసు వ్యవస్థ అంతా ఏమయిందని అవాక్కయ్యారు. ఆ తర్వాత మూడు రోజుల పాటు దాడులు సాగాయి. మొత్తం పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిందని… వైసీపీ సేవలో తరిస్తోందని.. ప్రజల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వడం లేదని మళ్లీ చెప్పుకున్నారు. ఈ ఎపిసోడ్ జరుగుతూండగానే ఈవీఎం ధ్వంసం కేసు వెలుగులోకి వచ్చింది. దాంతో మరోసారి వైసీపీ గూండాయిజం చర్చనీయాంశమయింది.

వైనాట్ 175 అని జగన్ రెడ్డి పదే పదే ఎందుకు అంటున్నాడో.. ఆయన వ్యవస్థల్ని ఏపీలో ఏ స్థితికి తీసుకు వచ్చాడో అందరికీ స్పష్టత వచ్చింది. రెండు రోజుల నుంచి ఇదే అంశంపై దేశవ్యాప్త చర్చ జరుగుతోంది. నిందితుడైన ఎమ్మెల్యేను తప్పించడం కోసం సివిల్ సర్వీస్ అధికారులే తమ అధికార హోదాను దుర్వినియోగం చేస్తూండటం .. బరితెగించిన వ్యవస్థల్లోని పెద్దల ఆకృత్యాలకు అద్దం పడుతోంది. మొత్తానికి జగన్ రెడ్డి నిర్వాకం..దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. దేశం మొత్తం వైసీపీ వైపు చూస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అమరావతిలో జగన్ గుర్తులు అలాగే !

అమరావతిలో జగన్ జ్ఞాపకాల్ని అలాగే ఉంచాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. జగన్ జ్ఞాపకాలు అంటే ఆయన నిర్మించినవి ఏవీ లేవు. ధ్వంసం చేసివవే. ముఖ్యంగా ప్రజావేదిక. కూర్చున్న కొమ్మనే నరుక్కున్న తెలివి...

ఎంవీవీ ఫ్యామిలీ కిడ్నాప్‌లో అసలు కథ త్వరలో !

విశాఖ ఎంపీగా ఉన్నప్పుడు ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లోనే ఆయన భార్య, కుమారుడ్ని నిర్బంధించి ఆస్తులు రాయించుకున్న ముఠా వ్యవహారంలో అసలు నిజాలు ఎప్పుడూ బయటకు రాలేదు. నిందితులపై ఎలాంటి కేసులు పెట్టారో కూడా...

మోదీకి చెక్ పెట్టేలా ఆరెస్సెస్ వ్యూహం !

ఆరెస్సెస్‌కు మోదీకి మధ్య దూరం అంతకంతకూ పెరుగుతోంది. రాముడే మోదీకి బుద్ధి చెప్పాడనే ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేజ్ కుమార్ వ్యాఖ్యలు వైరల్అవుతున్నాయి . ఆయన ఒక్కడే ఈ లతరహాలో వ్యవహరిస్తే...

బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ప్రవీణ్ కుమార్ ?

బీఆర్ఎస్ పార్టీ ఊపిరి పోకుండా ఉండేందుకు కేసీఆర్ అనేక రకాల సమీకరణాలపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ లేకపోవడంతో బీఆర్ఎస్‌కు ఓటు బ్యాంక్ లేకుండా పోయింది. ఆ విషయంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close