మీడియా వాచ్ : కోర్ టీడీపీ ఫ్యాన్స్ మద్దతు కోల్పోయిన ఏబీఎన్ !

ఏబీఎన్, ఆంధ్రజ్యోతికి ఆదరణ ఉందంటే దానికి కారణం …. వైసీపీ వ్యతిరేకత , టీడీపీ సానుకూలత. వైసీపీకి వ్యతిరేకంగా ఏం రాస్తున్నారో అని ఆ పార్టీ నేతలు ఉత్కంఠగా ఎదురు చూస్తూంటారు. టీడీపీ వాళ్లు సహజంగానే కోర్ ఆడియన్స్. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూసిన మూడు రోజులు … టీడీపీ గెలుస్తూంటే.. అసలు ఆ ఫ్లేవరే ఏబీఎన్‌లో కనిపించలేదు. ఆంధ్రజ్యోతి పత్రికతో పోలిస్తే కనీసం పది శాతం కవరేజీ కూడా లేదు. కనీసం గెలుస్తున్న అప్ డేట్స్ ఇవ్వలేదు. టీడీపీకి ఫేవర్ గా వచ్చే వార్తలు ఫాస్ట్ గా ఇస్తారేమో అని టీడీపీ క్యాడర్ అంతా ఏబీఎన్ వైపు చూస్తే నిరాశే మిగిలింది. టీవీ5, ఈటీవీ బెటరని వారు సోషల్ మీడియాలో నేరుగా అసంతృప్తి వ్యక్తం చేసుకున్నారు.

నిజానికి ఏబీఎన్‌లో పరిస్థితులు మారిపోయాయి. వేమూరి రాధాకృష్ణ చానల్‌పై దృష్టి పెట్టడం ఎప్పుడో మానేశారు. దీంతో అక్కడ స్థిరంగా ఉండే మ్యాన్ పవర్ లేకుండా పోయింది. దీంతో డెస్క్ పై … ఏబీఎన్ సోల్ పై పట్టు ఉన్న వాళ్లంతా చానల్ ను వదిలేసిపోయారు. ప్రస్తుతం డెస్క్ ను లీడ్ చేస్తుంది.. పని చేస్తున్న సబ్ ఎడిటర్లు… ఇంచార్జులు అంతా తెలంగాణ. పైగా ఉద్యమంలో పాల్గొన్న బ్యాక్ గ్రౌండ్. వారికి ఏపీ విషయాలను లైట్ తీసుకుంటున్నారు. టీడీపీ అంశాలను అసలు పట్టించుకోడం లేదు.

చానల్ పై రాధాకృష్ణ అజమాయిషీ తగ్గిపోవడంతో ఉద్యోగుల వ్యవహారాలు కూడా మితిమీరిపోతున్నాయి. కొంత మంది సొంత ప్రయోజనాల కోసం చానల్ను వాడేసుకుంటున్నారన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. వెంకటకృష్ణ చర్చా కార్యక్రమం తప్ప ఇతర విషయాలు పట్టించుకోవడం లేదు. మొత్తంంగా ఏబీఎన్ పరిస్థితి ఇప్పుడు గందరగోళంగా ఉంది. అందుకే టీడీపీ కోర్ ఆడియన్స్.. టీవీ5, ఈటీవీవైపు వెళ్లిపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

అనుప‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో కీర‌వాణి!

బాలీవుడ్ స్టార్ అనుప‌మ్ లో ఓ న‌టుడే కాదు, ద‌ర్శ‌కుడూ ఉన్నాడు. 2002లో ఓం జై జ‌గ‌దీష్ అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ త‌ర‌వాత ఇప్పుడు 22 ఏళ్ల త‌ర‌వాత మ‌ళ్లీ...

బెల్లంకొండ పాంచ్ ప‌టాకా!

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ య‌మ స్పీడుగా ఉన్నాడు. వ‌రుస‌గా సినిమాల్ని ప‌ట్టాలెక్కిస్తున్నాడు. 'టైస‌న్ నాయుడు' చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. '30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా' ఫేమ్ మున్నాతోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు...

చివరి క్షణం టిక్కెట్‌తో గుడివాడ అమర్నాథ్‌కు మరిన్ని కష్టాలు !

రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు అనూహ్య పరిణామాల మధ్య గాజువాక అసెంబ్లీ టికెట్ ఖాయమైంది. నియోజకవర్గంలో అడుగు పెట్టీ పెట్టగానే ఆయనకు స్థానిక నేతల నుంచి అసంతృప్తి సెగ తగిలింది. నియోజకవర్గంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close