ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ వాయిదా పడింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 19న మంత్రివర్గం సమావేశం కావాలని మొదట నిర్ణయించారు. ఈమేరకు అధికారికంగా ప్రకటించినప్పటికీ, ప్రధాని పర్యటనను దృష్టిలో ఉంచుకొని వాయిదా వేశారు.
ఈనెల 19న జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఈ నెల 21నే విశాఖలో యోగా డే ఉండటం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ వస్తుండటంతో మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేయాలని నిర్ణయించారు.
తిరిగి మంత్రివర్గ సమావేశాన్ని 24న నిర్వహించాలని ప్రభుత్వ అధికారిక వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర కేబినెట్ సమావేశాలను నెలకు రెండుసార్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతినెలా మొదటి, మూడో గురువారాల్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని షెడ్యూల్ ఖరారు చేసింది.
ఇందులో భాగంగా ఈ నెల 19న మంత్రివర్గం భేటీ కావాలని నిర్ణయించారు. కానీ , ప్రధాని పర్యటన నేపథ్యంలో మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేశారు.