కంచుకోటల్లోనే జగన్ ప్రచారం – ఇంత భయమా ?

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలు గట్టిగా ముఫ్పై నియోజకవర్గాల్లో జరిగాయి. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు ఉంటే.. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కనీసం యాభై నియోజకవర్గాల్లో ప్రజలకు తాను చేసిందేమిటో.. మళ్లీ గెలిపిస్తే ఏం చేస్తారో చెప్పలేకపోయారు. జగన్ ప్రచారం చేసిన నియోజకవర్గాలు ఎక్కువగా వైసీపీకి పట్టున్నవే.

సాధారణంగా పార్టీ బలహీనంగా ఉందనుకున్న నియోజకవర్గాలకు అధినేతలు ప్రచారంలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సభలు చూస్తే… చాలా మందికి ఆశ్చర్యం వేస్తుంది. కడప జిల్లాలో ఆయన మూడు నియోజకవర్గాలను కవర్ చేశారు. కడప టౌన్ లోనూ ఆయన ప్రచారం చేయాల్సి వచ్చింది. వరుసగా గెలుస్తూ వస్తున్న బాపట్ల, మాచర్ల, నర్సరావుపేట, కర్నూలు, పలమనేరు, వంటి నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు.

నిజానికి వైసీపీకి చాలాకష్టంగా ఉన్న నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. కనీసం వంద నియోజకవర్గాల జోలికి వెళ్లలేదు. కూటమి ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న కోస్తా ప్రాంతంలో.. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో ఆయన ప్రచారసభలు ఎక్కువగా పెట్టాల్సింది. కానీ తూ…తూ మంత్రంగా నిర్వహించేశారు. ఈ సారి కంచుకోటలు కూడా బద్దలయ్యే పరిస్థితి ఉందన్న ఆందోళనతోనే జగన్ ఇలా .. కనీసం అటూ ఇటుగా ఉన్న స్థానాలనైనా గెల్చుకుందామని అలాంటి ప్రచారం చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

LRS అమలుతో తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊపు !

తెలంగాణలో లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(LRS)‌ను అమల్లోకి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్లియర్‌ అవ్వని LRS సమస్యలను.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని...

తిరుమ‌ల‌లో ప్ర‌క్షాళ‌న మొద‌లు… మంచి రోజులొచ్చిన‌ట్లే!

తిరుమ‌ల వెంక‌న్న ద‌ర్శ‌నం అంటే దేశ‌, విదేశాల నుండి వ‌స్తుంటారు. ఉత్త‌రాధి నుండి తిరుమ‌ల‌కు ఒక్క‌సారి వెళ్లి రావాల‌న్న వారు అధికంగా ఉంటారు. వెంక‌టేశ్వేర స్వామి వారి ద‌ర్శ‌నం కోసం ఎంత క‌ష్ట‌మైన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close